కపిల తీర్థం టు రామతీర్థం .. ఇదీ బీజేపీ యాత్ర రూట్ మ్యాప్..!

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కపిల తీర్థం టు రామతీర్థం రథయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. విశాఖలో జరిగిన ఏపీ కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆలయాల కూల్చివేతలను ఖండిస్తూ.. కపిలతీర్ధం నుంచి రామతీర్థం వరకూ యాత్రను.. ఫిబ్రవరి 4 నుంచి 8 రోజుల పాటు నిర్వహిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. దేవాలయాలపై దాడులు జరిగిన ప్రాంతాలను కలుపుతూ యాత్ర జరుగుతుంది.

పిఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలంలో అన్యమత ప్రాబల్యం వంటి ఘటనలపై జన జాగృతి సభలను నిర్వహిస్తారు. ఆలయాలపై ఏపీలో జరుగుతున్న దాడుల విషయంలో బీజేపీ సరైన విధంగా అడ్వాంటేజ్ తీసుకోలేకపోతోందన్న అభిప్రాంయ.. పార్టీ హైకమాండ్ వ్యక్తం చేసిందని.. అందుకే ప్రత్యేక కార్యాచరణను ఢిల్లీ నుంచి ఖరారు చేసి పంపారని చెబుతున్నారు. ఈ మేరకు వారి సూచనల ప్రకారం.. రామరథయాత్రను ఖరారు చేసుకున్నారని చెబుతున్నారు.

ముందుగా రామతీర్థం నుంచి ప్రారంభించాలనుకున్నప్పటికీ… అక్కడే ముగిస్తే మంచి ఎఫెక్ట్ వస్తుందని భావించారు. అందుకే కపిల తీర్థం నుంచి ప్రారంభించారు. కపిల తీర్థంలో ఎలాంటి వివాదాలు జరగకపోయినప్పటికీ.. అక్కడ్నుంచి ప్రారంభిస్తే మంచిదన్న ఉద్దేశంతో ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎనిమిది రోజుల యాత్రలో .. రోజుకో జాతీయ నేతను పపిలిపించాలని ప్లాన్ చేస్తున్నారు. రోజూ కుదరకపోయినా.. ప్రదానమైన ఆలయాల దగ్గరకు వచ్చినప్పుడు.. పిలిపించాలని అనుకుంటున్నారు. ఇక ముందుగా ప్రభుత్వాన్ని హిందూత్వ అంశంపైనే ఇరుకున పెట్టాలన్న నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. తమపై ఆరోపణలు చేసిన డీజీపీ విషయంలోనూ బీజేపీ సీరియస్ గా ఉంది.

డీజీపీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకని .. ఈ నెల 20 తేదీలోపు డీజీపీ క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డెడ్ లైన్ పెట్టారు. యాత్రలో ఎవరెవరు పాల్గొనాలనేదానిపై స్పష్టత లేదు కానీ.. ముఖ్య నేతలందరూ పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ముందుగానే రథయాత్ర చేపట్టాలన్న ఆలోచన వచ్చినప్పటికీ.. ఏర్పాట్ల కోసం సమయం కావాలని ఆలోచించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి.. హిందూత్వం విషయంలో బీజేపీ స్పందన లేట్ అనే ఫీలింగ్ ఉన్నా.. ఇప్పుడు రథయాత్ర కూడా లేటుగానే స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే టీడీపీ తిరుపతిలో ఇరవై ఒకటో తేదీ నుంచి ధర్మ పరిరక్షణ యాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close