ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఏపీ సర్కార్ పరిమితికి మించి అప్పులు చేస్తోందని నేరుగా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశారు. అదీ కూడా ఆషామాషీగా చేయలేదు. అన్ని లెక్కల వివరాలను చాలా స్పష్టంగా తెలుసుకుని.. ఎంత అప్పులు చేయాలి.. ఎంత చేస్తున్నారు… వంటి అంశాలన్నింటినీ.. లెక్కలు చెప్పి మరీ ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ లేఖ… ఏపీ ఆర్థిక శాఖలోనే కాదు.. ఢిల్లీలోనూ కలకలం రేపుతోంది.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ.. ఏపీ సర్కార్ అప్పులు తెస్తోందని.. ఇందు కోసం.. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేషన్‌కు బదిలీ చేసి తాకట్టు పెడుతోందని ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి పదివేల కోట్ల రుణాలు చేసిందని.. ఉచిత పథకాలకు మరో 3 వేల కోట్ల రుణం తెచ్చేందుకు బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదిస్తోందని గుర్తు చేశారు. పరిమితికి మించి చేసిన అప్పుల కారణంగా వచ్చే ఏడాది నుంచి 35 వేల కోట్లు కేవలం వడ్డీ గా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలకు సగటున 9,226 కోట్ల అప్పులు చేసిందని విచక్షణరహితంగా చేస్తున్న అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడితప్పిందని తక్షణం జోక్యం చేసుకోవాలని రఘఉరామ ప్రధానని కోరారు.

కేంద్రంతో వైసీపీకి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే సమయంలో.. రుణాలతో పాటు.. రాష్ట్రానికి రావాల్సిన లోటు నిధులు.. ఇతర విషయాల్లో కేంద్రం బాగానే సహకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన నిధులను దారి మళ్లించినా పెద్దగా పట్టించుకోవడం లేదు. అన్నీ తెలిసినా… రఘురామకృష్ణరాజు.. కేంద్రానికిలేఖ రాశారు. ఒక వేళ.. ఆ లేఖను ప్రధాని పరిశీలించాలని ఆర్బీఐకో.. ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖకో పంపితో.. వారు వివరాలు సేకరిస్తారు. అప్పుడు.. కొంత అలజడి రేగడం ఖాయమని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close