రైతుల పిటిషన్లపై వాదనలకు రూ. ఐదు కోట్ల లాయర్‌ను మాట్లాడుకున్న ఏపీ సర్కార్..!

లాయర్ ఫీజు కోసం.. ఏపీ ప్రభుత్వం రూ. ఐదు కోట్లు విడుదల చేసింది. ఇది ప్రభుత్వం తరపున వివిధ కోర్టుల్లో వాదన కోసం నియమితులైన అడ్వకేట్ జనరల్ దగ్గర్నుంచి.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వరకూ.. నెలకు ఇచ్చే జీతాల కన్నా.. చాలా..చాలా ఎక్కువ. ఆ లాయర్ పేరు ముకుల్ రోహత్గీ. ఆయన వాదించాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న రాజధాని తరలింపు అంశాలపై సుప్రీంకోర్టులో పడిన పిటిషన్లు. ప్రభుత్వం తరపున ఎలాటి వాదనలు అయినా.. అడ్వకేట్ జనరల్ వాదించడం కామన్. ప్రైవేటు లాయర్లను.. అంత సామాన్యంగా.. ప్రభుత్వం నియమించుకోదు.

ముఖ్యంగా కోట్లకు కోట్లు ఫీజులు ఇచ్చి అసలు నియమించుకోదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఏ మాత్రం తగ్గాలనుకోవడం లేదు. ప్రజల సొమ్మే కాబట్టి.. ఆయన అణుంత కూడా ఆలోచించలేదు. తక్షణం ముకుల్ రోహత్గీకి రూ. కోటి అడ్వాన్స్ చెల్లించాలని జీవో జారీ చేశారు. ఆ జీవోలోనే ఆయన ఫీజును రూ. ఐదు కోట్లుగా పేర్కొన్నారు. రాజధాని తరలింపు.. సీఆర్డీఏ రద్దుల పై.. హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. సీఆర్డీఏ బిల్లు రద్దు చేయడం వల్ల … రైతులకు.. లక్షన్నర కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్ల వరకూ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని.. న్యాయనిపుణులు అంచనా వేశారు.

అలాగే.. విభజన చట్టం ప్రకారం.. మూడు రాజధానుల ఏర్పాటు కూడా.. సాద్యం కాదని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వం తరపున సమర్థవంతమైన వాదనలు వినిపించి… హైకోర్టులో సరైన ఫలితం పొందేందుకు.. ప్రభుత్వం రూ. ఐదు కోట్ల లాయర్‌ను నియమించింది. రోహత్గీ అత్యంత సీనియర్ లాయర్. ఆయన మాజీ అటార్నీ జనరల్ గా పని చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close