కేఏ పాల్ టిక్కెట్ రూ. 5 లక్షలు..! వద్దంటే ఫ్రీ…!

రాజకీయ పార్టీ పెట్టిన కేఏ పాల్.. రూ. ఐదు లక్షలకే టిక్కెట్ ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదీ కాకపోతే.. కనీసం ఉచితంగా అయినా తీసుకోమని బతిమాలుతున్నారు. పొరపాటున ఎవరైనా… ఎదురెళ్లి.. నేను మీ అభిమానినంటే… వెంటనే..”ఎవరక్కడ..” అని తన సిబ్బందిని పిలిచి…”గివ్ హిమ్ ఏ టిక్కెట్” అని ఆర్డర్ వేసేస్తున్నారు. దీంతో.. అలా పలకరించిన వాళ్లు షాక్‌గు గురవుతున్నారు. కేఏ పాల్… ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ.. ఎవరూ ముందుకు రాలేదు. దాంతో.. తెలిసిన వాళ్లకి, పాస్టర్లకి… టిక్కెట్లు ఇచ్చారు. ఇంకా మిగిలిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఓ టెక్నిక్ ప్రవేశ పెట్టారు.

ఎవరైనా వచ్చి.. సార్ నేను మీ ఫ్యాన్‌ను అంటే.. వెంటనే… మెరిసేపోయే కళ్లతో చూస్తున్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన తర్వాత.. ఓ వ్యక్తి ఇలాగే “సార్..మేము మీ అభిమానులం…యూ ట్యూబ్ లో మీ వీడియోలు బాగా చూస్తాం…” అని రొటీన్‌గా ఓ మాట అన్నారు. వెంటనే.. పాల్ తన సిబ్బందిని టక్కున పిలిచారు. ఇతను నా అభిమాని అని చెప్పారు. వెంటనే ఇతని ఊరు, పేరు, వివరాలు కనుక్కుని ఏ ప్రాంతంలో టిక్కెట్ కావాలో అడిగి వెంటనే ఇచ్చేయండి అని చెప్పేశారు. అలాగేనంటూ సిబ్బంది తలూపారు. ఆ తరువాత సిబ్బంది మీడియా విభాగంలోని ఆ వ్యక్తి వద్దకు వచ్చి వివరాలు అడిగారు. పాపం ఆ వ్యక్తి భయపడి వెళ్లిపోయాడు.

కేఏ పాల్ రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకున్నారో కానీ… ఏపీలో మాత్రం చాలా కామెడీ చేస్తున్నారు. ఆయన చేస్తున్న చేష్టలు చూసి.. చాలా మంది… నవ్వుకుంటున్నా.. ఎలా ఉండేవాడు.. ఎలా అయిపోయాడని.. జాలి పడుతున్నారు. కానీ కేఏ పాల్ మాత్రం.. తాను అప్పట్లో ఎలా ఉండేవాడినో.. ఇప్పుడూ అలానే ఉంటున్నానన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరి ఎన్నికలయ్యేలోపు… కేఏ పాల్ ఏం చేస్తారో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close