అక్కినేని ‘మెగా’ మ‌ల్టీస్టార‌ర్‌

చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌…. అగ్ర తార‌లుగా త‌న ఆధిప‌త్యం చ‌లాయించారు. ఇప్ప‌టికీ వాళ్ల ప్ర‌భావం ఉంది. అయితే ఎవ‌రూ ఎప్పుడూ మ‌రో అగ్ర హీరోతో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌లేదు. చేసే అవ‌కాశాలు వ‌చ్చినా – అప్ప‌ట్లో కొన్ని స‌మీక‌ర‌ణాల వ‌ల్ల కుద‌ర్లేదు. వెంకీ – నాగ్ లు క‌లిసి `ఘ‌ర్ష‌ణ‌` సినిమా చేయాలి. మ‌ణిర‌త్నం వీరిద్ద‌రికీ క‌థ వినిపించాడు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ `నో` చెప్పాల్సివ‌చ్చింది. చిరంజీవి, నాగార్జున క‌లిసి ఓ సినిమా చేద్దామ‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. కానీ క‌థే సెట్ అవ్వ‌డం లేదు.

ఆ త‌రంతో సాధ్యం కాని ఫీట్లు.. ఈ త‌రం చేసి చూపిస్తోంది. ముఖ్యంగా మ‌ల్టీస్టార‌ర్ విష‌యాల్లో. ఇద్ద‌రు హీరోలు క‌లిసి ప‌నిచేయ‌డం వ‌ల్ల‌.. ఎన్ని సౌల‌భ్యాలు ఉన్నాయో ఇప్పుడిప్పుడే అంద‌రికీ అర్థం అవుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు మెగా – అక్కినేని మ‌ల్టీస్టార‌ర్‌కి రంగం సిద్ధం అవుతోంద‌ని స‌మాచారం. సాయిధ‌ర‌మ్ తేజ్ ద‌గ్గ‌ర‌కు ఓ క‌థ వ‌చ్చింది. ఇందులో మ‌రో హీరోకి కూడా స్కోప్ ఉంది. నిజానికి ఇద్ద‌రు మెగా హీరోల‌తో ఈ సినిమా చేయాల‌న్న‌ది ద‌ర్శ‌కుడి ఉద్దేశం. కానీ… సాయిధ‌ర‌మ్ తేజ్ మాత్రం అఖిల్, నాగ‌చైత‌న్య‌ల‌లో ఒక‌రైతే బాగుంటుంద‌ని సూచించాడ‌ట‌. ఇప్పుడు క‌థ‌.. వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. అఖిల్, చైతూ… వీళ్ల‌లో ఎవ‌రు ఓకే అన్నా.. ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కుతుంది. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close