టీడీపీ నేతలకు సజ్జల ఎన్‌కౌంటర్ బెదిరింపులు !

వైసీపీలో చేరకపోతే ఎన్ కౌంటర్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల బెదిరించారా ? అంటే అవుననే అంటున్నారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆయనను రెండున్నర నెలలు జైల్లో పెట్టక ముందు ఓలాయర్ ద్వారా సజ్జల కాంటాక్ట్ అయ్యారు. జగన్ సీరియస్‌గా ఉన్నారని తనను కలవకపోతే ఎన్ కౌంటర్ చేస్తామని సజ్జల బెదిరించారని చింతమని నేరుగా కోర్టును ఆశ్రయించారు. అలా బెదిరించడమే కాదు రెండు సార్లు ఎన్ కౌంటర్‌కు ప్రయత్నం చేశారట. తన దగ్గర ఉన్న సాక్ష్యాలతో చింతమనేని కోర్టును ఆశ్రయించారు.

పోలీసు వ్యవస్థ సజ్జల గుప్పిట్లో ఉందన్నది బహిరంగ రహస్యం. మొదటి రోజు నుంచి టీడీపీ నేతలే టార్గెట్‌గా ఆయన ఆపరేషన్ ప్రారంభించారని టీడీపీ నేతలు చెబుతూంటారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను కూడా చంపేస్తామని బెదిరించడంతోనే ఆ పార్టీలో చేరారని చెబుతున్నారు. ఇంకా పలువురికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయని అందకే పార్టీలు మారారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చింతమనేని వాటిని నేరుగా ప్రస్తావిస్తూ కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు.

గత మూడేళ్ల కాలంలో టీడీపీ నేతలపై ఇష్టా రీతిన కేసులు పెట్టారు. ఎంతో మందిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారు. కొంతమంది చేరారు. మరికొంత మంది తిరగబడ్డారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సజ్జల పార్టీ నేతల్ని చంపుతామని కూడా బెదిరించిన ఘటనలు మాత్రం సంచలనం రేపుతున్నాయి. పోలీసులతో ఎన్ కౌంటర్లు చేయిస్తామని బెదిరించారన్న విషయం బయటకు తెలియడం ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది. చింతమనేని వేసిన ప్రైవేటుకేసులో విచారమ జరిగి నిజానిజాలు తెలిస్తే .. సంచలనం అయ్యే అవకాశం ఉంది. అయితే అది ప్రభుత్వం మారిన తర్వాతే జరగడానికి చాన్స్ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close