క్యాడర్ హోప్స్ పెట్టుకోవద్దని హింట్స్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ క్యాడర్ ను ఆర్తికంగా చితికిపోకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగులు కట్టి నష్టపోకుండా ఉండేందుకు ఆయన మెల్లగా హింట్స్ ఇస్తున్నారు. దాదాపుగా ప్రతి రోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన కౌంటింగ్ ప్రక్రియపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. కౌంటింగ్ అయినా సక్రమంగా జరుగుతుందా.. అని ఆయన దీర్ఘాలు పోతూ అనుమానాలు వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రక్రియను గుప్పిట్లో పెట్టుకునేందుకు సజ్జల ప్రయత్నాలు చేశారు. ఈసీ ఆదేశాలు అమలు కాకుండా చేయడంలో ఆయన గుప్పిట్లో ఉన్న అధికారులే కీలకం. గెలిచే అవకాశమే ఉంటే.. ఇలా దాడులు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి పోలీసు వ్యవస్థ చేతుల్లో ఉన్నప్పుడే కసి.. కక్ష తీర్చుకోవాలని డిసైడయ్యారు. ఆ పని చేశారు. పోలీసులు తర్వతా కఠిన చర్యలు తీసుకుంటారని.. ఇంకా ఈసీ చేతుల్లోనే పాలన ఉందని సజ్జలకు తెలియకుండా ఎలా ఉంటుంది ?. అందుకే ఈసీ టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాలు పాటించిందని సజ్జల అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని చెప్పడానికి ఇంత కన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుందని వైసీపీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారు.

2019 ఎన్నికల సమయంలో టీడీపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తమ పరిపాలన సంక్షేమ, అభివృద్ధి సమతూకంగా నడిచిందని ప్రజల మీద అసలు భారం వేయకుండా పాలన చేశామని అనుకున్నారు. అందుకే పార్టీ హైకమాండ్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చివరికి అది నమ్మకంతో సొంత పార్టీ క్యాడర్ బెట్టింగులు గట్టిగా పెట్టుకోవడానికి కారణం అయింది. అలా కూడా పార్టీ క్యాడర్ నష్టపోయింది. ఈ సారి అలాంటి పరిస్థితి వైసీపీ క్యాడర్ కు రాకుండా ఉండేందుకు సజ్జల ముందస్తుగా హింట్స్ ఇస్తున్నారని.. ఓటమికి కారణాలు చెబుతున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close