హైకోర్టు తీర్పు జగన్ మీడియాకు వినిపించలేదు..! కనిపించలేదు..!

నేను ఉన్నాను… నేను విన్నాను..! అంటూ… జగన్మోహన్ రెడ్డి మీడియా… సాక్షి.. ఎన్నికల సమయంలో ఎంత హడావుడి చేసిందో… ప్రజలందరికీ ఇంకా గుర్తుంది. అయితే.. ఎన్నికలు పూర్తయి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత… జగన్ మీడియాకు.. ఏమీ వినిపించడం లేదు. ఏమీ కనిపించడం లేదు. అవసరమైన చోట మాత్రం.. కాస్త తేడాగా వినిపించుకుని.. కల్పించుకుని రాస్తోంది. ఆ వెసులుబాటు లేని చోట… అసలు వార్తకే జెల్ల కొడుతోంది. ప్రస్తుతం.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో… హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు విషయంలో… సాక్షి పత్రిక.. ఇదే పద్దతిని పాటించింది. కేవలం నాలుగంటే..నాలుగు లైన్లు.. అదీ కూడా.. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించినదని ఎక్కడా చెప్పకుండా.. హైకోర్టు తీర్పు వార్త రాసేసి.. తమకు అసలు మనస్సాక్షి లేదని… దాన్ని ఎప్పుడో చంపేసుకున్నామని నిరూపించుకున్నారు.

పోలవరం రివర్స్ టెండర్లను.. నిలిపి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పులో ఎన్నో కీలక వ్యాఖ్యలు చేసింది. ఒప్పందాలను.. ప్రభుత్వం ఏకపక్షంగా ఉల్లంఘిస్తూ.. రద్దు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పవర్ ప్రాజెక్ట్ విషయంలో… అసలు ఏపీ సర్కార్ ఏ అధికారంతో.. కాంట్రాక్టును టెర్మినెట్ చేసిందని ప్రశ్నించింది. ఓ రకంగా.. ఏపీ సర్కార్.. మొండి వాదనకు.. దందుడుకు నిర్ణయాలకు… హైకోర్టు తీర్పు గట్టిగానే షాక్ లా తగిలింది. దీనిపై.. తమ వాదన వినిపించుకునే అవకాశం కూడా సాక్షికి దొరకలేదు. అందుకే.. ఓ చిన్న కాలమ్‌ ఆర్టికల్‌తో సరిపెట్టారు.

నిజానికి సాక్షి మీడియాది ఓ ప్రత్యేక శైలి. తమకు ఏది కావాలో… అది ఊహించేసుకుని రాసుకుంటుంది. కొన్నాళ్ల కిందట.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సమావేశం జరిగింది. ఆ సమయంలో… రివర్స్ టెండర్లు వద్దని పీపీఏ స్పష్టంగా చెప్పింది. అయితే సాక్షి మాత్రం.. పీపీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తమ పత్రికకలో రాసుకున్నారు. ఇప్పుడు.. హైకోర్టు తీర్పు విషయంలో.. అలాంటి వెసులుబాటు.. సాక్షి మీడియా తీసుకోలేకపోయింది. అలా తీసుకుని ఉంటే.. కోర్టు ధిక్కరణ అవుతుందని భయపడ్డారేమో కానీ.. చిన్న వార్తతో సరిపెట్టారు. అందులోనూ.. ఎన్నో నిజాలు దాచి పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close