రెండు కాపీలు కొనాల్సిందే..! ప్రజాధనం సాక్షి ఖాతాకు..!

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తన సొంత మీడియాను ప్రమోట్ చేసుకునే విషయంలో ఏ మాత్రం మొహమాటానికి పోవడం లేదు. ప్రభుత్వం రాగానే సాక్షి ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి తీసుకుని వందల మందికి.. లక్షల్లో జీతాలిస్తున్న ప్రభుత్వం తర్వాత ప్రకటన రూపంలో కోట్లకు కోట్లు ఆ పత్రికకు మళ్లిస్తోంది. ప్రకటన రూపంలో వెచ్చించే ప్రజాధనంలో యాభై నుంచి అరవై శాతం తన పత్రికకే మళ్లించుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా పేపర్ సర్క్యూలేషన్ పెంచుకోవడానికి కూడా ప్రజాధనాన్నే నిస్సంకోచంగా ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు,గ్రామ సచివాలయాలను జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. అక్కడ రెండు దినపత్రికలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

ఎవరైనా రెండు దినపత్రికలు అంటే రెండు వేర్వేరు పత్రికలనుకుంటారు. కానీ జగన్ సర్కార్ పెద్దలు వినూత్నంగా ఆలోచించారు. రెండు పత్రికలంటే.. రెండు పత్రికలు.. రెండూ ఒకటే.. అదీ సాక్షి. అంటే.. సాక్షినే రెండు కాపీలను ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంతో కొనిపిస్తున్నారన్నమాట. కొనిపించడమే కాదు..ఏకంగా ఏడాది పాటు అడ్వాన్స్ కూడా వసూలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో అధికారులు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు.

ప్రకటనల పేరుతో ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున సొంత ఖాతాలకు మళ్లించుకోవడం.. సాక్షి సిబ్బందిని ఎడాపెడా… ఉద్యోగాల్లోకి తీసుకుని రూ .లక్షలకు లక్షలు జీతాలివ్వడమే కాదు..ఇప్పుడు పత్రికను కూడా ప్రజాధనంతో కొనిపించే చర్యలకు ప్రభుత్వ పెద్దలు వెనుకాడటం లేదు. ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా.. కనీసం నైతికంగా కూడా కరెక్ట్ కాదన్న ఆలోచన లేకుండా.. ప్రభుత్వ పెద్దలు ఇలా ప్రజాధనాన్ని సొంత సంస్థలకు మళ్లించుకోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్‌లో ఇదో పెద్ద స్కాంగా మారినా ఆశ్చర్యం లేదని విపక్ష నేతలు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close