సీఎస్‌గా సమీర్ శర్మ మరో ఆరు నెలలు !

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. బెంగాల్‌లో చీఫ్ సెక్రటరీ పొడిగింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ చీఫ్ సెక్రటరీల స్థాయి వారికి పొడిగింపులు ఇవ్వకూడదని అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ కేంద్రం తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో నిర్ణయాలను కూడా అదే మాదిరిగా పాజిటివ్‌గా తీసుకుంటూ ఉంటుంది. ఈ ప్రకారం ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకుని సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

సహజంగా మూడు నెలలకు మాత్రమే పొడిగింపు ఇస్తారు. ఆ తర్వాత మరోసారి మూడు నెలల పొడిగింపు రిక్వెస్ట్‌ను బట్టి ఇస్తారు. ఇక ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రిటైర్ కావాల్సిందే. అయితే ఇక్కడ మాత్రం ఒకే సారి సమీర్ శర్మకు ఆరు నెలల పొడిగింపు లభించింది. దీంతో రెండు నెలల ముచ్చటగానే సీఎస్‌ పదవి కాలం మిగిలిపోతుందన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. ఆయన పదవి విరమణ కన్నా మరో ఆరు నెలలు పొడిగింపు లభించినందున వచ్చే ఏడాది జూన్ వరకే ఆయనే చీఫ్ సెక్రటరీగా ఉంటారు.

దీంతో ఆయన రిటైరైపోతారు.. చీఫ్ సెక్రటరీ అయిపోవచ్చని ఆశలు పెట్టుకుని జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, సీసీఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్‌లకు వెయిటింగ్ తప్పడం లేదు. మొత్తంగా చూస్తే కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వల్ల.. చాలా విషయాల్లో వ్యవహారాలు స్మూత్‌గా వెళ్లిపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close