ఏపీలో ఇసుక ఇక ఒక్కరికే సొంతం..! 

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ప్రస్థానం ఉచితం దగ్గర్నుచి ఒకరికే మొత్తం కట్టబెట్టడం వరకూ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఇసుక రీచ్‌లను ఒకే సంస్థకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుంటే ఇంటికే డోర్ డెలివరీ చేస్తోంది. ఆన్ లైన్ బుకింగ్.. ఇంటికి డెలివరీ చేయడం… రవాణా చార్జీలు మొత్తం ఫ్రాడ్ అన్న ఆరోపణలు ప్రజల నుంచి రావడంతో ఇసుక పాలసీని మార్చాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్.. ప్రజల సూచనలే శిరోధార్యమని చెప్పి..రూ. కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు. 

ఎంత మంది ప్రజలు ఒకే కంపెనీకి ఇసుక మొత్తం కట్టబెట్టాలని సలహా ఇచ్చారో చెప్పలేదు.. ప్రజల నుంచి ఎలాంటి సూచనలు వచ్చాయో చెప్పలేదు కానీ…  మొత్తం ఇసుకను ఒక్కరికే కట్ట బెట్టాలని నిర్ణయించింది. మొదటగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం అనుకుందట.. కానీ  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రాకపోవడంతో… పేరుగాంచిన ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సు చేసిందిట. ఆ పేరుగాంచిన ప్రైవేటు సంస్థ ఏదో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

తమిళనాడులో ఇసుక కాంట్రాక్టులు నిర్వహిస్తున్న శేఖర్ రెడ్డినో.. మరో  ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ సామాజిక బాధ్యత ఉన్న ప్రముఖుడో ఇసుక మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజలకు ఇసుక భారంగా మారింది. ఇప్పుడు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా వైసీపీ నేతలు ఇసుక దోచుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడా విమర్శలకు చెక్ పడే అవకాశం ఉంది.  ఒక్క వ్యక్తే దోచుకుంటున్నారని ఆరోపణలు చేసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ఎవరికి బినామినో కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close