సానియా, హింగిస్…. యు.ఎస్. ఓపెన్ చాంపియన్స్

భారత్ కు డబుల్ ధమాకా. సానియా మీర్జా, మార్టినా హింగిస్ ల జోడీ యు ఎస్ ఓపెన్ మహిళల విభాగంలో చాంపియన్ గా నిలిచింది. మరో టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇదే టోర్నీలో మార్టినా హింగిస్ లియాండర్ పేస్ తో కలిసి మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఒకే టోర్నీలో ఇద్దరు భారతీయులతో జోడీ కట్టి రెండు టైటిల్స్ గెలిచిన హింగిస్ గెలిచిన మొత్తం గ్రాండ్ స్లాం టైటిల్స్ సంఖ్య 20కి చేరింది.

ఫైనల్ మ్యాచ్ లో సానియా, హింగిస్ జోడీ అద్భుతమైన సమన్వయంతో చెలరేగి ఆడింది. ప్రత్యర్థులకు పెద్దగా అవకాశాలు ఇవ్వకుండా అలవోకగా విజయం సాధించింది. ఆస్ట్రేలియా, కజక్ స్తాన్ క్రీడాకారిణుల జోడీని 6-3, 6-3 స్కోరుతో వరుస సెట్లలో సునాయాసంగా ఓడించింది. 70 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది.

మొత్తానికి మన సానియా మీర్జా 5 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచినట్టయింది. ఇందులో మార్టినా హింగిస్ పాత్ర మరువ లేనిది. ఆమె లేకపోతే సానియా, పేస్ లకు ఇన్ని టైటిల్స్ దక్కేవే కావు. వీరిద్దరి పాలిట మార్టినా దేవత అంటే అతిశయోక్తి కాదంటున్నారు క్రీడా పండితులు. చక్కటి సమన్వయం, పరస్పర సహకారం, పోరాట స్ఫూర్తి, విజయ కాంక్ష, స్నేహపూర్వక వాతావరణంలో ప్రాక్టిస్ చేయడం వంటి లక్షణాల వల్ల మార్టినా మనవాళ్లకు సరైన జోడీ అయింది. డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ జోడీ అంటే ఇలా ఉండాలనిపించేలా జోడీ కుదిరింది. మొత్తానికి సానియా మీర్జాకు యు ఎస్ ఓపెన్ లో అత్యద్భుతమైన విజయం సొంతమైంది. విజయగర్వంతో శంషాబాద్ లో అడుగు పెట్టబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close