చరిత్ర సృష్టించిన సానియా: హింగిస్‌తో కలిసి వింబుల్డన్ టైటిల్ కైవసం

భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సంచలనం సృష్టించింది. వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ ను మార్టినా హింగస్ తో కలిసి కైవసం చేసుకుంది. కెరీర్లో మహిళల డబుల్స్ లో తొలి గ్రాండ్ స్లాం టైటిల్ అందుకుంది. లండన్ లోని వింబుల్డన్ సెంట్రల్ కోర్టు సానియా, హింగిస్ విజయనాదంతో దద్దరిల్లింది. టైటిల్ చేజార్చుకుంటారేమో అనే టెన్షన్ నుంచి, తిరుగులేని విజేతలుగా నిలిచే వరకూ వీరిద్దరూ అద్భతమైన ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు.

రష్యా అమ్మాయిలు ఎకతరీనా మకరోవా, ఎలెనా మెస్నినాలతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తొలి రౌండ్ల సానియా జోడీ 5-7 స్కోరుతో ఓడిపోయింది. దీంతో అభిమానులు నిరాశ పడ్డారు. సానియాకు టైటిల్ రాదేమో అని కలవర పడ్డారు. కానీ పడిలేచిన కెరటంలా సానియా, హింగిస్ లు రెండో సెట్లో విజృంభించి ఆడారు. అయినా ప్రత్యర్థి జోడీ హోరాహోరీ పోటీనిచ్చింది. చివరకు 7-6 స్కోరుతో సానియా జోడీ విజయం సాధించింది. ఇక మిగిలించి మూడో రౌండ్. అందులో గెలిచిన వారికే టైటిల్. సానియా, మార్టినా సమన్వయంతో ఆడి ప్రత్యర్థి జోడీని చిత్తు చేశారు. 7-5తో చివరి సెట్ గెల్చుకున్నారు. దాంతో పాటే మ్యాచ్ ను, టైటిల్ ను సొంతం చేసుకున్నారు. సానియా, హింగిస్ లు టాప్ సీడ్ గా బరిలోకి దిగగా, రష్యా జోడీ రెండో సీడ్ గా బరిలోకి దిగారు. చివరకు తుది ఫలితం కూడా అలాగే రావడం విశేషం.

మ్యాచ్ గెలవగానే అమ్మాయిలిద్దరూ నేలమీద లేరు. ఆనందంతో గాలిలో తేలియాడారు. సంతోషంతో కేరింతలు కొట్టారు. తనకైతే ఇది మరో జన్మలా ఉందని మార్టిన హింగిస్ సంబరపడి పోయింది. వింబుల్డన్ లో మరో టైటిల్ గెలవడానికి హింగిస్ 17 ఏళ్లే ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తానికి, సానియాతో జతకట్టిన తర్వాత ఆ నిరీక్షణ ఫలించింది.

సానియా మిర్జీ మిక్స్ డ్ డబుల్స్ లో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచినా ఇతర విభాగాల్లో మాత్రం ఒక్కటీ దక్కలేదు. ఇప్పుడా కొరత తీరింది. మహిళల డబుల్స్ లో ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ, అదీ అత్యంత ప్రతిష్టాత్మక వింబుల్డన్ టైటిల్ గెలవడం సానియా ఇమేజిని తారాస్థాయికి చేర్చింది. సెంట్రల్ కోర్టులో వేల మంది అభిమానుల మధ్య టైటిల్ ను అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది సానియా. నిజంగా తాను మినీ ఇండియాలో ఉన్నట్టుందని సంతోషించింది. పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఈ మ్యాచ్ చూడటానికి వచ్చారు. సానియాను ప్రోత్సహించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close