కేసీఆర్‌పైనా సొంత పార్టీ సర్పంచ్‌ల ఆగ్రహం !

ఏపీలో వైసీపీలో సర్పంచ్‌లు కూడా జగన్ ను శాపనార్ధాలు పెట్టడం చాలా రోజులుగా కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూ అదే పరిస్థితి వచ్చింది. కేంద్రం ఇచ్చిన పదిహేనో ఆర్థిక సంఘం నిధులను తెలంగాణ సర్కార్ వాడేసుకుందని ఆరోపిస్తూ.. సర్పంచ్‌లు రోడ్డెక్కారు. వైసీపీ సర్పంచ్‌లు రాజీనామాలు చేస్తున్నారు. పంచాయతీ నిధులు పంచాయతీలకు జమ చేయాలంటున్నారు. దీనపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు కూడా చేస్తున్నారు.

పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తుంది. 15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కొద్ది రోజుల కిందట నిధులు విడుదల చేసింది. అన్ని పంచాయతీలకు కలిపి ఈ మొత్తం రూ. ఐదు వేల కోట్ల కన్నా ఎక్కువగానే ఉంటుంది. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఈ డబ్బును డ్రా చేసి, ఆయా గ్రామ పంచాయతీల్లోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అధికారం సర్పంచ్‌లకు మాత్రమే ఉంటుంది. కానీ డిజిటల్ కీ ఉపయోగించి ప్రభుత్వం మొత్తం మళ్లించుకుందని.. ఇప్పుడు పంచాయతీ నిధుల్లో పైసా కూడా లేవని సర్ంచ్‌లు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ పల్లెల్లో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ లే ఉన్నప్పటికీ పంచాయతీ నిధులు వస్తే గ్రామాల్లో పనులు చేపట్టాలని.. లేదా ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు డ్రా చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వచ్చినవి వచ్చినట్లుగా మాయం కావడంతో వారు నిరాశ చెందుతున్నారు. రాజీనామాలు చేస్తామంటున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. నిధులు తిరిగి ఇవ్వకుంటే ప్రగతి భవన్ తలుపులు బద్దలు కొడతామని సర్పంచ్‌ల సంఘం హచ్చరికలు జారీ చేస్తోంది. అయితే కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను ఎక్కడా కూడా ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించలేదని పంచాయతీలు చేసిన ఖర్చులకు బిల్లులను చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ బిల్లులు పంచాయతీలే చెల్లించాలి కానీ.. ప్రభుత్వం తమ నిధులు వసూలు చేసి చెల్లించడమేమిటని..నమ్మశక్యంగా లేదని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ కు సర్పంచ్‌ల సెగ బాగానే తగిలే చాన్సులు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close