ఎస్బీఐ లోన్ మేళా .. దివాలా నుంచి బయటపడిన సర్కార్ !

ఎస్బీఐలో హోమ్ లోన్‌కు ధరఖాస్తు చేసుకుంటే ప్రాసెస్ పూర్తయ్యే సరికి ఎంత కాలం పడుతుంది.? సిబిల్ స్కోర్ 800 దాటినా కనీసం రెండు నెలలు పడుతుంది.కానీ ఏపీ సర్కార్‌కు ఖచ్చితంగా వారం అంటే వారం రోజుల్లో రూ. 1500కోట్ల రుణం ఇచ్చేసింది ఎస్‌బీఐ. అదీ కూడా ఏపీ సర్కార్ కు తాకట్టు పెట్టడానికి.. గ్యారంటీ ఇవ్వడానికి ఏమీ లేకపోయినా ఔదార్యం చూపించింది. ఏపీ మారిటైమ్ బోర్డ్ అని ఇటీవల ఓ బోర్డును ఏర్పాటు చేశారు. ఆ బోర్డు పేరుతో అదానీకి పోర్టులు కట్టబెట్టేశారు. ఇప్పుడు ఆ బోర్డు పేరుతో ఏకంగా రూ. పదిహేను వందల కోట్ల అప్పు తెచ్చారు. ఆ అప్పుతో పోర్టులు కడతారా అని డౌట్ వస్తే ఖచ్చితంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై అవగాహనలేనట్లే.

వారం రోజుల కిందట కేంద్ర విద్యుత్ సంస్థల చైర్మన్లు వచ్చి అప్పు తీర్చాల్సిందేనని పీకల మీద కూర్చున్నారు. అప్పటికప్పుడు సలహాదారుగా నియమించుకున్న ఎస్‌బీఐ మాజీ చైర్మన్ రజనీష్‌తో.. నేరుగా ప్రస్తుత ఎస్‌బీఐ చైర్మన్‌తో మాట్లాడుకుని.. ఏ ఒప్పందం చేసుకున్నారో కానీ రూ. పదిహేను వందల కోట్ల రుణానికి అంగీకరింపచేశారు. ఆ రుణాన్ని మారిటైం బోర్డు పేరుతో తీసుకున్నారు. బ్యాంక్ నుంచి మారిటైం బోర్డు ఖాతాలోపడగానే.. వెంటనే  ఆ నిధుల్ని కేంద్ర విద్యుత్ సంస్థల వాయిదాలకు చెల్లించేశారు. అసలు మారిటైం బోర్డుకు..  జెన్‌కోలు చెల్లించాల్సిన అప్పనకు సంబంధం ఏమిటి.. ఎందుకు తీసుకున్నారన్నది తర్వాత కథలో ప్రభుత్వం చెబుతుంది. మనం తెలుసుకుంటాం.

ఆర్థిక నిర్వహణ అత్యంత దారుణంగా ఉన్న ఏపీకి ఎస్‌బీఐ ఏ హామీ పెట్టుకుని రూ. పదిహేను వందల కోట్లు ఇచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బ్యాంకుల తీరుపైనా అందుకే అనుమానాలు వస్తున్నాయి. ఎస్‌బీఐ క్యాప్స్ సంస్థకు ఇప్పటికే రుణాలు ఇప్పింటే బాధ్యతలు ఇచ్చి .. కమిషన్లు కట్టబెడుతున్నారు. ఇప్పుడు సలహాదారుకు ఈ రుణంలో ఎంత కమిషన్ ఇస్తున్నారో కానీ.. మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికి దివాలానుంచి బయటపడింది. దీనికి ఎస్‌బీఐ సాయం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close