ఆర్బీఐ రిపోర్ట్ : విడిపోయాక తెలంగాణ బంగారమే !

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారంగా మారిపోయింది.ఈ విషయాన్ని ఆర్బీఐ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అంటే 2014-15లో 29,288 కోట్లు ఇప్పుడు 2020-21లో ఆదాయం 85,300కోట్లు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి నుంచి ఏడేళ్లలో జీఎస్డీపీ ఏకంగా 117 శాతం వృద్ధి నమోదు చేసింది. ఐటీ, ఐటీ అనుబంధ సేవలు, ఔషధ రంగ పరిశ్రమలతోపాటు వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనూ అద్భుత వృద్ధి సాధించింది.  సొంత పన్నులు, పన్నేతర ఆదాయం సైతం భారీగా పెరిగింది. ఐటీ, తయారీ, పారిశ్రామిక, వ్యవసాయ, మైనింగ్‌ రంగాలు గణనీయ వృద్ధి సాధించడంతో ఖజానాకు రాబడి పెరిగింది. 2014-15తో పోల్చితే.. 2020-21 నాటికి పన్నేతర ఆదాయం 474 శాతం, పన్నుల ఆదాయం 291 శాతం పెరిగింది.

ఏడేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలు గణనీయంగా వృద్ధిని నమోదు చేయడంతో.. రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటితో పోలిస్తే మూడింతలకుపైగా రాబడి వృద్ధి నమో దైంది. పన్నుల రాబడితోపాటు పన్నేతర ఆదాయాన్నీ ప్రభుత్వం పెంచుకోగలిగింది. ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు కూడా మూడింతలు పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధిలో రాష్ట్రం మెరుగైన పనితీరు ప్రదర్శించింది. వరి, పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశ సగటుకన్నా 3, 4 రెట్లకుపైగా వృద్ధి నమోదయింది.

పెరిగిన ఆదాయానికి తగ్గట్లుగా తెలంగాణ ప్రభుత్వం అప్పులు కూడా చేసింది. 2021 మార్చి నాటికి రూ.2,52,325 కోట్లకు చేరాయి. ఆరేళ్లలో రూ. 1 లక్షా 80వేల కోట్ల వరకూ అప్పులు చేశారు. కానీ పెరిగిన ఆదాయంతో పోలిస్తే ఈ అప్పు పెద్ద భారం ఏమీ కాదు.  అప్పులతో కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టడంతో  అప్పులకు తగ్గ సంపద సృష్టి జరిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close