ఫిరాయింపులపై సుప్రీం కోర్టు కూడా ఏమి చేయలేదా?

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ, తెదేపా, వైకాపాలకు చెందిన అనేకమంది నేతలు అధికార తెరాస పార్టీలోకి దూకేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యామాని అది ఇంకా వేగం పుంజుకొందిపుడు. పార్టీలు మారిదలచినవారు ముందుగా తమ పార్టీ ద్వారా సంపాదించుకొన్న ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, మారినట్లయితే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ, తెదేపాల ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ తెరాసలో పనిచేస్తుండటమే చాలా ఎబ్బెట్టుగా ఉంది. కానీ సదరు నేతలు అందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. నిత్యం నైతిక విలువల గురించి మాట్లాడే తెరాస కూడా దానిని తప్పుగా భావించడం లేదు.

ఈ వ్యవహారంపై తెదేపా, కాంగ్రెస్ పార్టీ నేతలు మొట్టమొదట స్పీకర్ మధుసూదనాచారిని, ఆ తరువాత గవర్నర్ నరసింహన్ ని కలిసి పిర్యాదు చేసారు. కానీ ఫలితం లేదు. ఆ తరువాత హైకోర్టుని ఆశ్రయించారు. కానీ అది స్పీకర్ పరిధిలో ఉన్న అంశం కనుక తాము స్పీకర్ ని ఆదేశించాలేమని హైకోర్టు తన నిసహాయత వ్యక్తం చేసింది. తెదేపా, కాంగ్రెస్ పార్టీ నేతలు వేసిన పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కూడా అదేవిధంగా తన నిసహాయత వ్యక్తం చేయడంతో రాజకీయ వ్యవస్థలో ఈ వంకరను సరిచేసే మార్గమే లేకుండాపోయింది.

ఈ వ్యవహారంపై స్పీకర్ రెండు నెలలో తగిన చర్యలు తీసుకొంటారని ఆశిస్తున్నామని లేకుంటే అప్పుడు ఈ కేసును పునర్విచారిస్తామని సుప్రీం కోర్టు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉంది కనుక తను జోక్యం చేసుకోలేనని సుప్రీం కోర్టు భావిస్తున్నట్లయితే అదే విషయం స్పష్టంగా చెప్పవచ్చును. స్పీకర్ ని తను ఆదేశించగలనని భావిస్తున్నట్లయితే తక్షణమే ఆయనకి నోటీసులు పంపి సంజాయిషీ కోరవచ్చును. కానీ రెండు నెలల గడువు పెట్టడం దేనికో అర్ధం కాదు. బహుశః సుప్రీం కోర్టు విజ్ఞప్తిని మన్నించి స్పీకర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తారని భావిస్తోందేమో? ఏడాదిన్నర కాలంగా స్పందించని స్పీకర్ రెండు నెలలో స్పందిస్తారని ఆశించడం అత్యసే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close