జల్లికట్టు రాజకీయాలకు సుప్రీం సుత్తి దెబ్బ!

తమిళనాడులో ప్రతీ చిన్న అంశానికి కూడా ఒక రాజకీయ కోణం ఉంటుంది. ఉంటుంది అనే కంటే అక్కడి రాజకీయ పార్టీలు వాటితో రాజకీయాలు చేయడం ఒక ఆనవాయితీగా మార్చేసాయని చెప్పవచ్చునుపైగా ఈ ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఇక ఈ రాజకీయరంగులు ఇంకా ఎక్కువగా కనబడుతాయి. కనుక ప్రతీ ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రమంతటా నిర్వహించే జల్లికట్టు ఎద్దుల పోటీలకు కూడా ఆ రాజకీయరంగు అంటుకొంటే అదేమీ పెద్ద విశేషం కాదు. కానీ ఆ రాజకీయాలు..రంగుల గురించి పట్టించుకోని జంతు ప్రేమికులు జల్లికట్టు క్రీడపై చాలా కాలంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలు తరుముకొస్తున్న ఈ సమయంలో ప్రజలను ప్రసన్నం చేసుకోవాలంటే వారి అభీష్టం మేరకు జల్లికట్టు క్రీడను నిర్వహించాలని జయలలిత నేతృత్వంలో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె ప్రభుత్వం భావించడం అసహజమేమి కాదు. ఒకవేళ అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే, దాని నిర్వహణ కోసం పోరాడి ఆ క్రెడిట్ కొట్టేసేందుకు ప్రతిపక్షాలు సిద్దంగా కాచుకు కూర్చొన్నాయి. కనుక తమ పార్టీకే దానిపై ఎక్కువ శ్రద్ధ ఉందని నిరూపించుకోవలసి ఉంటుంది కనుక ఈ క్రీడను అనుమతించమని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం వెంటనే కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసింది.

తమిళనాడులో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చాలా కాలంగా కలలు కంటున్నారు. అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలు ఎంత బలమయిన జాతీయ పార్టీలు అయినప్పటికీ తమిళనాడులో నిలద్రొక్కుకోవాలంటే తప్పనిసరిగా అక్కడ బలంగా ఉన్న అధికార అన్నాడిఎంకె పార్టీ లేదా ప్రతిపక్ష డిఎంకె పార్టీలలో దేనితో ఒక దానితో జత కట్టక తప్పదు. లేకుంటే అక్కడ వాటికి ఒక్క ఓటు కూడా రాలదు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని చాలా కాలంగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల చెన్నైని వరదలు ముంచెత్తినప్పుడు ప్రధాని నరేంద్ర మోడి వెంటనే చెన్నై బయలుదేరి వెళ్లి జయలలితను కలవడం, ఆ రాష్ట్రానికి అడగక ముందే బారీ ఆర్ధిక సహాయం చేయడం, ఆ తరువాత జల్లికట్టు క్రీడపై లేఖ అందగానే హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయడం వగైరాలన్నీ జయలలితను ప్రసన్నం చేసుకొని అన్నాడిఎంకె పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడానికేనని వేరేగా చెప్పనవసరం లేదు. కానీ జల్లికట్టు క్రీడపై సుప్రీం కోర్టు నిన్న స్టే విధించడంతో ఆ రెండు పార్టీలకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది.

అప్పుడే తమిళనాడులో ప్రతిపక్ష పార్టీలు దీనిని మంచి అవకాశంగా వాడేసుకొంటున్నాయి. అధికార అన్నాడిఎంకె పార్టీకి ప్రజాభీష్టం పట్టించుకోదని అందుకే సుప్రీం కోర్టులో గట్టిగా వాదించలేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రీడ జరగకపోవడానికి అధికార పార్టీయే దోషి అని నిందిస్తున్నాయి.

ఈ సమస్య నుండి తమిళనాడు ప్రభుత్వాన్ని బయటపడేయకపోతే అమ్మకి బీజేపీపై ఆగ్రహం కలుగుతుంది. అలుగుతుంది. పొత్తులకు ‘నో’ చెప్పేస్తుంది. కనుక ఈ సమస్య పరిష్కరించవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. ఒకవేళ కేంద్రప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించలేకపోతే అప్పుడు అమ్మ ఆ సమస్యను తనదయిన శైలిలో పరిష్కరించవలసి ఉంటుంది. లేకుంటే ప్రతిపక్షాలు దీనిపై రచ్చ రచ్చ చేసేసి ప్రజలను తమవైపు తిప్పేసుకొంటాయి. కనుక అమ్మ కూడా ఈ జల్లికట్టు బాల పరీక్షలో పాస్ అవకతప్పదు.

ఈ విషయంలో కేంద్రప్రభుత్వం ఏమీ చేయలేనందుకు ఒకవేళ అమ్మకి ఆగ్రహం వచ్చేస్తే, అప్పుడు చక్రాల కుర్చీలో కూర్చొని రాజకీయాలు చేస్తున్న డి.ఎం.కె. అధ్యక్షుడు కరుణానిధి ముందు పొత్తుల కోసం బీజేపీ సాగిలపడక తప్పదు.

ఏమిటో ఈ రాజకీయాలు…ఆ..అన్నట్లు నిన్న చెన్నై సముద్ర తీరానికి సుమారు వంద భారీ వేల్ చేపలు కొట్టుకువచ్చేయి..వాటిలో 42 చేపలను మాత్రమే సముద్రంలోకి పంపించగలగడంతో బ్రతికాయి. మిగిలినవన్నీ చచ్చిపోయాయి. అధికార పార్టీ అదృష్టమో లేక ప్రతిపక్ష పార్టీల దురదృష్టమో కానీ దీనిని తమిళనాడు ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకొని ఉండి ఉంటే చనిపోయిన వేల్ చేపలు కూడా తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసి ఉండేవి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close