సుజనా కోసం ఏపీ సర్కార్ సీక్రెట్ ఆపరేషన్..!

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో వారం రోజులుగా.. ఏపీ రెవిన్యూ అధికారులు మకాం వేశారు. ప్రతీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను పరిశీలిస్తున్నారు. పలు గ్రామాల్లో.. ఈ సెర్చింగ్ జరుగుతోంది. ఏం చేసినా.. ఎలా చూసినా… వీరి లక్ష్యం ఒక్కటే.. ” ఇది సుజనా చౌదరికి చెందిన భూమినా..?. ఈ భూములు సుజనా చౌదరి బినామీలకు చెందినవా..? సుజనా చౌదరి 2014 నుంచి కొనుగోలు చేసిన భూమి ఎంత..? వారి బంధువుల భూమి ఎంత..? ఇలా.. ప్రతీ సందేహంలోనూ.. సుజనా చౌదరిని పెట్టుకుని విచారణ జరుపుతున్నారు. వారం రోజుల నుంచి ఈ పరిశీలన జరుగుతోంది. స్థానిక ఎమ్మార్వో ఇతర పనులేమీ పెట్టుకోకుండా.. సిబ్బంది మొత్తాన్ని వారికే కేటాయించి .. సహకరిస్తున్నారు.

సవాల్ చేసినందున సుజనా సంగతి తేల్చాలనుకుంటున్నారా..?

రాజధాని పరిధిలో… 2010 నుంచి ఒక్క అంగుళం భూమి కొనుగోలు చేసినా… నిరూపించాలంటూ.. సుజనా చౌదరి కొద్ది రోజుల కిందట.. విజయసాయిరెడ్డికి సవాల్ చేశారు. అంతకు ముందు ఆయన … సుజనా… పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలో… సుజనా సవాల్‌ను విజయసాయిరెడ్డి సీరియస్‌గా తీసుకున్నారని చెబుతున్నారు. వెంటనే… ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బొత్స సత్యనారాయణ.. గతంలో కొన్ని కంపెనీల పేర్లు చెప్పి… కొంత మంది పేర్లు చెప్పి… అవి సుజనా చౌదరివేనని మాటల ద్వారా ఆరోపించారు. కానీ.. .వాస్తవాలు.. ఆధారాలు బయటపెట్టలేకపోయారు. ఎలాగైనా వాటిని బయట పెట్టాలని… ప్రభుత్వ యంత్రాంగాన్ని పెద్దలు పరుగులు పెట్టిస్తున్నారు.

రాజధానిలో సుజనా చౌదరికి ఉన్న బినామీ భూముల గురించి లెక్క తేలలేదా..?

మొదట సీడ్ క్యాపిటల్ పరిధిలో సుజనా కు.. వందల ఎకరాలున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. వివరాలు మొత్తం బయటకు తీసి.. యలమంచిలి అన్న ఇంటి పేరు ఉన్న వారివన్నీ.. సుజనా చౌదరి బినామీలేనన్నట్లుగా సాక్షిలో కథనాలు రాశారు. దీనిపై సుజనా చౌదరి.. సర్కార్ తీరును ఎద్దేవా చేశారు. దాంతో.. ప్రభుత్వంలో మరింత పట్టుదల పెరిగిందంటున్నారు. సీడ్ క్యాపిటల్ కాకపోతే… సీఆర్డీఏ పరిధిలో అయినా… సుజనా చౌదరి భూములను లెక్క తేల్చి… ఆయన గుట్టు బయట పెట్టాలని భావిస్తున్నారు. అందుకే.. ఆయన స్వగ్రామం ఉన్న కంచికచర్ల మండలం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. 2014 నుంచి కొనుగోళ్లను పరిశీలించి.. బినామీలు ఉన్నారో లేదో.. చూస్తున్నారు.

జగన్ సర్కార్ టార్గెట్ చేస్తే అంతే..!?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని .. వేల ఎకరాలను టీడీపీ నేతలు కొనుగోలు చేశారని.. ఆరోపించారు. వీరిలో సుజనా చౌదరిది కీలక హస్తమని నేరుగానే చెబుతూ ఉంటారు. అయితే… అధికారంలోకి వచ్చాక.. రికార్డులు మొత్తం తీస్తే.. సీడ్ క్యాపిటల్ పరిధిలో 2014లో కేవలం 180 ఎకరాలకు సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరిగాయన్న విషయం తెలినట్లుగా… ప్రచారం జరుగుతోంది. అందుకే.. నల్లగొండ సరిహద్దులో ఉన్నప్పటికీ… సీఆర్డీఏ పరిధిలో అంటూ.. ఏదో రకంగా.. తమ ఆరోపణలకు ఆధారాలు వెదుక్కునేపనిలో జగన్ సర్కార్ పడిందంటున్నారు. మొత్తానికి.. ఇప్పుడు.. టీడీపీ నేతలపై కక్ష సాధింపుల కోసమే.. ప్రభుత్వ యంత్రాంగం అంతా.. పని చేస్తోందని.. ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close