9 సంవత్సరాల తర్వాత హిందీలో రీమేక్‌ అవుతున్న తెలుగు సినిమా.!

‘డాలర్‌ డ్రీమ్స్‌’, ‘ఆనంద్‌’, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్‌’, ‘లీడర్‌’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు చేసి డిఫరెంట్‌ కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శేఖర్‌ కమ్ముల తెలుగు, తమిళ భాషల్లో నయనతారతో రూపొందించిన ‘అనామిక’ చిత్రానికి అనుకున్నంత రెస్పాన్స్‌ రాలేదు. దాంతో కొంత గ్యాప్‌ తీసుకొని ఇప్పుడు బాలీవుడ్‌ వైపు కన్నేశాడు శేఖర్‌. తనకు యూత్‌లో ఎంతో పేరు తెచ్చిన ‘హ్యాపీడేస్‌’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

2007లో రిలీజ్‌ అయిన ‘హ్యాపీడేస్‌’ చిత్రాన్ని దాదాపు 9 సంవత్సరాల తర్వాత హిందీలో రీమేక్‌ చెయ్యాలనుకోవడం వెనుక రీజన్‌ ఏమిటో తెలీదుగానీ ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల మాత్రం ఆ సినిమా కోసం లొకేషన్స్‌ వెతికే పనిలో బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కి అనుకూలంగా వుండే కాలేజీల కోసం నార్త్‌లోని కొన్ని సిటీస్‌ని సందర్శించిన శేఖర్‌.. పూనేలోని ఓ కాలేజ్‌ని సెలెక్ట్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మరోపక్క నటీనటుల ఎంపిక కూడా స్పీడ్‌గా జరుగుతోందట. కాలేజీలకు సెలవులు ఇచ్చిన తర్వాత మార్చి ఎండింగ్‌లో ఈ సినిమా షూటింగ్‌ని స్టార్ట్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాడు శేఖర్‌. ఈ చిత్రాన్ని శేఖర్‌ కమ్ముల స్వయంగా నిర్మిస్తుండగా, బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించే అవకాశం వుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం అఫీషియల్‌గా కన్‌ఫర్మ్‌ చెయ్యాల్సి వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close