‘2.ఓ’ ఫ్లాపవుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌క‌మా?

డిసెంబర్ 7న అరడజను సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. అందరి కంటే ముందు ఏడో తేదీ మీద ‘శుభలేఖలు’ అనే చిన్న సినిమా కర్చీఫ్ వేసింది. తరవాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘కవచం’, అంతా కొత్తవాళ్ళతో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ‘హుషారు’ వచ్చాయి. సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’, సందీప్ కిషన్, తమన్నా జంటగా నటించిన ‘నెక్స్ట్ ఏంటి?’ సినిమాలు వారం క్రితం అనూహ్యంగా డిసెంబర్ 7వ తేదీ రేసులోకి వచ్చాయి. “పెద్ద దర్శకుడు చిన్న పిల్లల కోసం తీసిన సినిమా ‘2.ఓ’ అయితే… చిన్న దర్శకుడు పెద్దల కోసం తీసిన ‘భైరవగీత” అంటూ పబ్లిసిటీ కోసం పలు ట్వీట్లు చేసిన వర్మ, సెన్సార్ సమస్యల వల్ల తను నిర్మించిన ‘భైరవగీత’ను డిసెంబర్ 7కి వాయిదా వేశారు. మొత్తం మీద డిసెంబర్ 7వ తేదీన అటుఇటుగా 7 సినిమాలు విడుదలవుతున్నాయి. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… గురువారం (మరికొన్ని గంటల్లో) రజనీకాంత్ ‘2.ఓ’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. ‘2.ఓ’ వచ్చిన ఏడెనిమిది రోజులకు పైన చెప్పుకున్న సినిమాలన్నీ వస్తున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైన రెండు మూడు వారాల వరకూ మీడియం రేంజ్ సినిమాలను విడుదల చేయరు. ఏవో చిన్నా చితకా సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ, డిసెంబర్ 7న విడుదలకు సిద్ధమైన ‘కవచం’, ‘నెక్స్ట్ ఏంటి?’ సినిమాలు కాస్త బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలే. కాజల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు వున్నారు. మిగతా సినిమాలూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందరూ డిసెంబర్ 7న వస్తామని గట్టిగా చెబుతున్నారంటే… ‘2.ఓ’ ఫ్లాపవుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌క‌మా? ఒకవేళ హిట్టయితే తమ సినిమాను వాయిదా వేద్దామనే ఆలోచనా? వెయిట్ అండ్ సీ!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close