షా 40 సమస్యలు పరిష్కరించేశారట ! అందులో ఏపీవి ఎన్ని ?

సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌ ముగిసింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ప్రకారం మొత్తం 51 పెండింగ్ ఇష్యూల్లో 40 పరిష్కరించేశారట. అయితే ఏ సమస్యలు పరిష్కరించారన్నదానిపై లిస్ట్ ఆయన పెట్టలేదు. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశంలో మాట్లాడి ప్రత్యేకంగా తమ సమస్యలను ప్రస్తావించారు. వాటిలో ఎన్నింటికి పరిష్కారాలు లభించాయో ఏపీ ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. తమిళనాడు నుంచి రావాల్సిన తెలుగు గంగ నిధుల దగ్గర్నుంచి ప్రత్యేకహోదా వరకూ జగన్ చాలా సమస్యలు ప్రస్తావించారు.

అలాగే రుణ పరిమితి పెంపు కోసం కూడా విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని తమకు కోత వేశారని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇవన్నీ పరిష్కారమయ్యాయో లేదో స్పష్టత లేదు. కేంద్రంతో సంబంధిచినవి కాకపోయినా పొరుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న సమస్యలకు అయినా ఏపీ వాటికి పరిష్కారం లభించిందో లేదో ప్రభుత్వమే ప్రకటన చేయాల్సి ఉంది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఉమ్మడి ఆస్తుల విభజన, తమిళనాడు నుంచి రావాల్సిన నిధులు, కుప్పం పాలారు ప్రాజెక్ట్ ఇలా మ్యూచవల్ సమస్యలకు అయినా ప్రభుత్వం పరిష్కారం తీసుకొచ్చిందో లేదో చూడాల్సి ఉంది.

సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీకి కేరళ, తమిళనాడు, తెలంగాణ సీఎంలు హాజరు కాకపోవడంతో కళ తప్పింది. బీజేపీ పాలితరాష్ట్రాలు అయిన కర్ణాటక, పాండిచ్చేరి సీఎంలు హాజరయ్యారు. ఆతిధ్యరాష్ట్రంగా ఏపీ సీఎం హాజరయ్యారు. అయితే సమావేశం సక్సెస్ ఫుల‌్ అని అమిత్ షా ప్రకటించేశారు కాబట్టి.. సమావేశం కోసం సుమారుగా రూ. యాభై కోట్ల వరకూ ఖర్చు పెట్టుకున్న ఏపీ ప్రభుత్వానికి ఎంత మేర సమస్యలు పరిష్కారమయ్యాయో తేలాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close