కాబోయే సీఎం : షర్మిలది కాన్ఫిడెన్సా ? ఓవర్ కాన్ఫిడెన్సా ?

తెలంగాణకు కాబోయే సీఎం తానేనని నిర్మోహమాటంగా ప్రకటిస్తున్నారు వైఎస్ షర్మిల, ఆమెలో ఆ కాన్ఫిడెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్‌లో అరెస్ట్ వ్యవహారం తర్వాత షర్మిలలో ఇంకా నమ్మకం పెరిగిపోయింది. రెండు రోజులుగా మీడియాకు ఇంటర్యూలు ఇస్తూ.. అసలు తాను ఎందుకు సీఎం కాలేనన్నట్లుగా చెబుతున్నారు. ప్రజలందరూ డిసైడైపోయారని.. వచ్చే ఎన్నికల్లో తననే సీఎంను చేస్తారని చెబుతున్నారు. ఇంకా విశేషం ఏమిటంటే.. తాను కాంగ్రెస్, బీజేపీల్లో చేరితే తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించేవారని.. కానీ రాజన్నబిడ్డగా వేరే పార్టీల్లో చేరడం ఏమిటని పార్టీ పెట్టుకున్నానని చెబుతున్నారు.

కేఏ పాల్ కూడా ఇంచు మించుగా ఇదే చెబుతారు. ఆయన తన కాన్ఫిడెన్స్‌ను మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ప్రయత్నం చేస్తారు. ఏ ఎన్నికలొచ్చినా పోటీ చేస్తారు. కానీ షర్మిల మాత్రం పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే ప్రయత్నం చేయలేదు. అసలు షర్మిలకు పోటీ చేయడానికి ఒక్క అభ్యర్థి కూడా లేరు. తెలంగాణ మొత్తం రెడ్డి సామాజికవర్గం మెజార్టీ ఎక్కడ ఉన్నారో వెదుక్కుని పాలేరులో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆమెను అక్కడ ఆదరిస్తారా లేదా అన్నదానపై సవాలక్ష అనుమానాలున్నాయి. పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు కూడా లేరు.

అయినా ఆమె ప్రకటనలు చూసి తెలంగాణ రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. మరీ ఇంత ఓవర్ కాన్పిడెన్స్ కేఏ పాల్ కేటగరిలో ఆమెను చేర్చే పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ వైఎస్ఆర్‌టీపీని రాజకీయ పార్టీగానే పరిగణించడం లేదు. సంప్రదాయ రాజకీయ పార్టీల మధ్య ఓటర్లు చీలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల ఎందుకు ఇలా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా ప్రకటనలు చేస్తున్నారో చాలా మందికి వింతగానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close