ప్ర‌భాస్‌, చ‌ర‌ణ్ కోసం శ‌ర్వా స్పెష‌ల్ షో

శ‌ర్వానంద్ కు ఇండ‌స్ట్రీ నిండా ఫ్రెండ్సే. అంద‌రితోనూ బాగుంటాడు. అంద‌రూ కావాల‌నుకుంటాడు కాబ‌ట్టి.. అంత ఫ్రెండ్ ఫాలోయింగ్‌. ముఖ్యంగా ప్ర‌భాస్‌, చ‌ర‌ణ్‌ల‌తో శ‌ర్వా చాలా క్లోజ్ గా ఉంటాడు. చ‌ర‌ణ్‌, రానా, శ‌ర్వానంద్ వీళ్లంతా ఒకే స్కూల్ లో చ‌దివారు. కాబ‌ట్టి.. మ‌రింత స్నేహం ఉంది వీళ్ల మ‌ధ్య‌. శ‌ర్వా నటించిన కొత్త సినిమా `ఒకే ఒక జీవితం`. ఈనెల 9న విడుద‌ల అవుతోంది. ఈ సినిమాపై శ‌ర్వా చాలా న‌మ్మ‌కాలు పెట్టుకొన్నాడు. అందుకే గ‌ట్టిగా ప్ర‌మోష‌న్ చేయాల‌ని భావిస్తున్నాడు. ఈ సినిమాని త‌న స్నేహితులైన ప్ర‌భాస్‌, చ‌ర‌ణ్‌, రానాల కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించ‌బోతున్నాడ‌ట‌. వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకొని, ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో త‌న ఫ్రెండ్స్‌ని వాడుకోవాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే శ‌ర్వా త‌న బాల్య స్నేహితులు కొంత‌మందికి ఈ సినిమా చూపించాడు. వాళ్లంద‌రి నుంచీ మంచి ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఫ్రెండ్స్ కోసం స్పెష‌ల్ షో వేయ‌బోతున్నాడు. 6,7, 8 తేదీల్లో `ఒకే ఒక జీవితం` స్పెష‌ల్ ప్రీమియ‌ర్స్ ప్లాన్ చేస్తున్నాడు. హైద‌రాబాద్ తో పాటు మిగిలిన ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ సినిమాని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈవారం సినిమాల హ‌డావుడి బాగానే ఉంది. నేను మీకు బాగా కావ‌ల్సిన‌వాడిని, కెప్టెన్‌, బ్ర‌హ్మాస్త్రం చిత్రాలు ఈ వార‌మే విడుద‌ల అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close