షీనాబోరా కేసులో అసలు ట్విస్ట్ ఇదే!

హైదరాబాద్: హాలీవుడ్ థ్రిల్లర్‌ను మరిపించే విధంగా రోజుకో మలుపు తిరుగుతున్న షీనా బోరా హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసులో రోజుకో రకంగా కొత్త కొత్త కోణాలు, కొత్త కొత్త పాత్రలు వెలుగు చూస్తుండటం, ఈ కేసు విస్తృతి దృష్ట్యా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఉంటుందని బయటకు కనిపిస్తున్నా, అసలు కారణం వేరొకటని తెలుస్తోంది. ఈ కేసును పర్యవేక్షిస్తున్న ముంబాయి పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాను కొద్ది రోజులక్రితం ఉన్నట్లుండి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ బదిలీ వెనక ఒక బీజేపీ ఎంపీ హస్తం ఉన్నట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు రాకేష్ స్థానంలో వచ్చిన అహ్మద్ జావేద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి, ఆమె భర్త పీటర్ ముఖర్జియా తనకు పార్టీ సర్కిల్స్‌లో పరిచయమేనని, గత ఏడాది ఈద్ పార్టీకి వారిని ఆహ్వానించానని చెప్పటం సంచలనం సృష్టించింది. ఒకవైపు రాకేష్ మారియా బదిలీపైనే విమర్శలు ఎదుర్కొంటుండగా, కొత్త కమిషనర్ అహ్మద్ వ్యాఖ్యలతో పరువు మరింత పోతోందని గ్రహించిన మహారాష్ట్ర ప్రభుత్వం, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే బయటకుమాత్రం, ఇది సాధారణమైన హత్యకేసుమాత్రమే కాదని, దీనివెనక ఆర్థిక లావాదేవీలుకూడా ఉన్నాయని ప్రాధమిక దర్యాప్తులో తేలినందునే సీబీఐకి అప్పగిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ కేపీ బక్షి నిన్న మీడియాతో చెప్పారు. ఏది ఏమైనా కేసు సీబీఐకు చేరటం ఈ మొత్తం వ్యవహారంలో ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close