ఢిల్లీ యూనివర్సిటీలో కేజ్రీవాల్ కు జలక్ !

ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఎ.బి.వి.పి. విజయం సాధించింది. అధ్యక్ష పదవి సహా మొత్తం 4 పదవులనూ ఆ సంస్థ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినట్టే, యూనివర్సిటీలోనూ తమ వాళ్లను గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నించారు. చివరకు ఓ స్టేడియంలో రాక్ షోతో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఆప్ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయనొక్కడే కాదు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రచారంలో పాల్గొన్నారు. కొన్ని పార్టీలు, విద్యార్థి సంస్థలు డబ్బు ఎరవేసి ఓట్లు కొనాలని చూస్తున్నాయని కూడా ప్రత్యర్థులపై ఆరోపణలు చేశారు. యూనివర్సిటీ క్యాంపస్ లో వై ఫై సౌకర్యం కల్పిస్తానని హామీ కూడా ఇచ్చారు.

అయినా విద్యార్థులు మాత్రం కేజ్రీవాల్ మాటలు పట్టించుకోలేదు. ఈసారి ఏబీవీపీని గెలిపించాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీజేపీకి, డి.యు.లో ఏబీవీపీ గెలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. నగరంలోని యువతలో, ముఖ్యంగా విద్యార్థుల్లో తమ బలం చెక్కు చెదరలేదని బీజేపీ నాయకులు ఖుషీ అవుతున్నారు. ఎన్ ఎస్ యు ఐ సహా ఇతర విద్యార్థి సంఘాలు ఎంత కష్టపడ్డా పరాజయం తప్పలేదు. ముఖ్యమంత్రి హోదాలోల విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రచారం చేసిన కేజ్రీవాల్ కు ఇది పెద్ద జలక్ అని ఏబీవీపీ, బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close