కాంగ్రెస్ కూటమిలోకి శివసేన.. పీకేకు చెక్ !

కాంగ్రెస్‌లో చేరి చక్రం తిప్పాలనుకున్న ప్రశాంత్ కిషోర్‌కు అక్కడ అడ్డుపుల్లపడింది. దాంతో కాంగ్రెస్‌ను లేకుండా చేసి మమతా బెనర్జీని ఆ ప్లేస్‌లోకి తేవాలని తన ఫిరాయింపుల వ్యూహ రాజకీయాలను ప్రయోగిస్తున్నారు. అయితే అది ఆయన అనుకున్నంత సులువుగా లేదు. మమతా బెనర్జీతో యూపీఏ ఎక్కడుంది అనిపించినా… కాంగ్రెస్ పార్టీ కూటమిలోనే ఉండేందుకు ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు సుముఖత చూపుతున్నాయి. శివసేన కూడా యూపీలోనే భాగస్వామి అవ్వాలని నిర్ణయించుకుంది .

ఇప్పటి వరకూ మహారాష్ట్రలో మాత్రమే కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని శివసేన చెబుతూ వస్తోంది. ఇప్పుడు జాతీయంగా కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని.. యూపీఏ కూటమిలో భాగమవుతామని ప్రకటించింది. ఇది మమతా బెనర్జీకి మరింత ఇబ్బందికరమే. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు… బీజేపీ వైపు కాకపోతే కాంగ్రెస్ వైపు ఉండాలనుకుంటున్నాయి కానీ మమతా బెనర్జీ వైపు ఉండాలనుకోవడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా మమతా బెనర్జీ కన్నా కాంగ్రెస్ బెటరనుకుంటోంది. బీజేపీ పరిస్థితి దిగజారుతోందని అనిపిస్తే మరిన్ని పార్టీలు కాంగ్రెస్ చెంత చేరే అవకాశం ఉంది.

వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలితే తర్వతా రాజకీయాలు పూర్తి స్థాయిలో మారే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్కూటమిలో చేరే పార్టీల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పీకే వ్యూహాలు మమతా బెనర్జీని ఒంటరినిచేస్తాయి కానీ.. జాతీయ నేతగా నిలబెట్టలేవన్న అభిప్రాయాలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close