సోము వీర్రాజు సై..! తిరుపతి లోక్‌సభ బరిలో బీజేపీ..!

భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. దూకుడు మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడుతామంటున్న ఆయన తమ బలం ఎంత ఉందో… క్రమంగా చూపించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో తన ఆలోచనలు చెప్పారు. అందులో ఒకటి.. తిరుపతి నుంచి లోక్‌సభ ఉపఎన్నికల బరిలో నిలవడం. ఇటీవలే.. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణించారు. అక్కడ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అక్కడ పోటీ చేసి.. బలం నిరూపించాలని సోము వీర్రాజు పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తన ఆలోచనను.. పార్టీ నేతల ముందు ఉంచారు.

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి కొంచెం చెప్పుకోదగిన చరిత్ర ఉంది. తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పుడల్లా.. ఆ సీటు బీజేపీకే వెళ్లేది. అక్కడి నుంచి ఎన్ . వెంకటస్వామి ఓ సారి బీజేపీ తరపున టీడీపీ మద్దతుతో ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు దక్కింది. కొద్ది తేడాతో ఓటమి పాలయింది. 2009లో మాత్రం విడిగా పోటీ చేసి ఇరవై వేల ఓట్లు తెచ్చుకోగలిగింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో తమకు బాగా క్యాడర్ ఉందని.. బీజేపీ నమ్మకం. అందుకే బలం నిరూపించుకోవడానికి ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఖాళీగా ఉన్న అన్ని పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు పెడతామని ఎ్నికల సంఘం ఇటీవల క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రకారం.. మరో రెండు నెలల్లో ఎన్నికలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలపై వైసీపీ, టీడీపీ ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. నిర్ణయాలు తీసుకోలేదు. సాధారణంగా సిట్టింగ్ సభ్యుడు చనిపోయినప్పుడు వారి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తూ ఉంటారు. అలా చేస్తే వేరే పార్టీ పోటీ పెట్టదు. ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close