విరాటపర్వం.. కవితాత్మకం

వేణు ఊడుగుల… ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పేరు. కానీ కొత్తతరం తెలుగు సాహిత్యం వేణు ఊడుగుల పేరు సుపరిచతమే. వేణు ఊడుగుల స్వతహాగా కవి. అతని కలంలో కవిత్వం పలుకుతుంది. ముఖ్యంగా విప్లవ కవిత్వం రాయడంలో వేణుది సెపరేట్ పంధా. ‘నీది నాది ఒకే కథ’లో ఆయన కలం కవిత్వం పలికించే అవకాశం రాలేదు. ఇప్పుడు రానాతో విరాటపర్వం చేస్తున్నాడు వేణు. ఈ సినిమాలో వేణు .. డైలాగ్స్ ని కూడా కవితల్లా మార్చాడని తెలుస్తుంది. ఇందులో రానా పాత్ర కవిత్వం రాస్తుంటుంది. ఆ కవిత్వానికి హీరోయిన్ సాయి పల్లవి, వెన్నెల పాత్ర ఆకర్షితురాలౌతుంది. అడవి, నక్సల్ నేపధ్యంలో వుండే విరాటపర్వంలో చాలా కవిత్వం వినిపిస్తుందని తెలిసింది. సాయి పల్లవి బర్త్ డే కానుగ విడుదలైన వీడియోలో కూడా పోయిట్రీగానే సాగింది.

”వెన్నెల రెండుసార్లు జన్మించింది
తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు
అడవి తల్లి ఒడిలో ఒకసారి
ఆశయాన్ని ఆయుధం చేసినట్టు
అతని ప్రేమలో మరొకసారి…
”నిర్బంధాలని కౌగలించుకున్న వసంతకాలం మనది.
రేపు మనం వున్నాలేకపోయిన చరిత్ర వుంటుంది, మన ప్రేమ కథని వినిపిస్తుంది

పైన మాటలు గమనిస్తే విరాటపర్వం ఎంత కవితాత్మకంగా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా జూలై 1 న ప్రేక్షకులు ముందుకు వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close