చైతన్య : హోదా బండెళ్లిపోతోంది ‘చలోరే..చలోరే.. చల్ ‘ సేనాని..!

 

 

 

“చలోరే.. చలోరే .. చల్..” ఈ పాట జనసైనికులకు ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. పాట విన్న ప్రతీసారి పిడికిలి బిగించి.. ఆవేశంతో.. ముని వేళ్ల మీద లేచి నిలబడి భావోద్వేగంతో ఊగిపోయేవాడిని. ఏదైనా చేయాలని.. ఆవేశ పడిపోయేవాడిని. ఇది నా ఒక్కరికే కాదు… జనసైనికులందరిదీ ఇదే పరిస్థితి. ఎందుకంటే.. “చలోరే.. చలోరే .. చల్..” పాటలో ఉన్న ఉద్వేగం కన్నా… పవన్ పై ఉన్న అభిమానంలో ఉండే కరెంటే…ఎక్కువగా ఉంటుంది. అందుకే.. పవన్ కల్యాణ్.. పిడికిలి బిగించి… పోరాటానికి సిద్ధం కండి అని పిలుపునిచ్చినప్పుడల్లా… జనసైనికుడినన్న ఆత్మవిశ్వాసంతో రెడీ అయిపోయా. కానీ ఇప్పటికీ పోరాటం కాకపోవడమే.. నాకు అసంతృప్తిగా ఉంది.

Also Read .. మార్పు నువ్వు సాధించగలవు పవన్..! by Chaitanya

మీతో పాటు ప్రాణాలర్పించడానికి సిద్ధమే..!

“ప్రత్యేకహోదా కోసం ఆమరణదీక్షకు సిద్ధం” అని జనసేనాని ప్రకటించినప్పుడు… పవన్ పై అంతులేని అభిమానం ఉన్న వారు మాత్రమే కాదు.. ఏపీ కోసం.. పోరాడేవారికి అండగా ఉండాలనుకునే యువతకు కూడా ఓ కిక్ వచ్చింది. అప్పటి వరకూ.. టీడీపీ, వైసీపీ .. రాజకీయ ప్రయోజనాల కోసం.. ప్రత్యేకహోదా అంశాన్ని వాడుకుంటున్నాయి..కాబట్టి.. సాధారణ ప్రజానీకం నుంచి వారి పోరాటానికి పెద్దగా స్పందన లేదు. వారి వారి పార్టీల క్యాడర్ మాత్రమే.. సపోర్ట్ చేశాయి. కానీ పవన్ ఆమరణదీక్ష ప్రకటన తర్వాత యువతలో ఉద్వేగం వచ్చింది  కానీ జనసేనాని.. ఆ ఉద్వేగాన్ని… ఉపయోగించుకోలేకపోయారు. ఆ ఆమరణదీక్ష అనే మాట మళ్లీ రాలేదు. ఇంకా చెప్పాలంటే.. ప్రత్యేకహోదా ఉద్యమం అనే మాట రాలేదు. అందుకే… జనసైనికునిగా… ఈ విషయంలో నాకు అసంతృప్తిగానే ఉంది.

టీడీపీ, వైసీపీ సరే.. ఏమీ చేయలేకపోతోంది జనసైనికులేనా..? 

ప్రత్యేకహోదా ఆంధ్రుల సెంటిమెంట్ గా మారింది. ఈ విషయంలో.. బీజేపీ ఎంత పట్టుదలగా వ్యవహరించిందో.. ితర పార్టీలు అంతే పట్టుదలగా .. సాధించే పోరాటాలు చేశాయి. నిజం చెప్పాలంటే.. పోరాటాల పేరుతో నాటకాలు ఆడాయి. అంతా రాజకీయమే. వైసీపీ.. ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన బీజేపీని పల్లెత్తు మాట అనుకపోయినా.. ఏదో ఓ ప్రోగ్రాం చేశామని అన్నట్లుగా.. కవర్ చేసుకుంది. అప్పుడప్పుడూ సభలు… పార్లమెంట్ ముందు ఆందోళనలు.. ఎంపీలతో రాజీనామాలు చేయించింది. అంతో ఇంతో.. పాపం .. పోరాడిందిలే.. అని సానుభూతి పరులతో అయినా అనిపించుకోగలిగింది. తెలుగుదేశం పార్టీ ఓ రకంగా.. త్యాగాలే చేసింది. బీజేపీతో కటిఫ్ చెప్పి.. మంత్రి పదవుల్ని కూడా వదిలేసుకుని.. ఎన్టీఏపై పోరాడి… సీబీఐ, ఈడీల దాడులకు కూడా బెదరకుండా… పోరాటం చేస్తోంది. అవిశ్వాసం పెట్టి… విపక్షాలందర్నీ కూడగట్టి.. చాలా పెద్ద ప్రయత్నమే చేసింది. రెండు పార్టీలదీ రాజకీయమే. పార్టీలన్నాక చేసేది రాజకీయమే కాబట్టి.. వాళ్లు చేయాల్సింది చేశారు. మరి … ఆమరణ దీక్ష అనే… సిక్సర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన జనసేనాని తర్వాత ఏం చేశారు. ..? ఏం చేశారో చెప్పుకోవడానికి జనసైనికుల దగ్గర సమాచారం కూడా లేదు.

హోదా ఓపెనింగ్ అడ్వాంటేజ్ ను వాడుకుందాం..!

హోదా పోరాటానికి ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ఎవరంటే.. వైసీపీ అయినా.. టీడీపీ అయినా చెప్పేది.. పవన్ కల్యాణ్ పేరే. నాడు తిరుపతి, కాకినాడ, అనంతపురంలలో పెట్టి సభల్లో.. హోదా కోసం పవన్ కల్యాణ్ చేసిన నినాదాలు.. ఇప్పటికీ జనసైనికుల చెవుల్లో మార్మోగిపోతున్నాయి. ఆ ఊపు చూస్తే.. ఇక ఏపీలో తిరుగులేని లీడర్ హోదా పోరాటానికి వచ్చారనే అనుకున్నాం .. కానీ… తీరా చివరికి వచ్చే సరికి… అసలు ఇంత సైలెంట్ గా ఎందుకు ఉండాల్సి వస్తోందనేది.. జనసైనికులకు ఆవేదన కలిగిస్తున్న అంశం. అటు టీడీపీ..ఇటు వైసీపీ.. ఏదో ఓ కార్యక్రమం హోదా కోసం చేసుకుంటూ వెళ్తున్నా… జనసైనికులు మాత్రం కామ్ గా ఉండాల్సి రావడం.. భరించలేని కష్టం. ఒక్కడికి బలం లేదు.. అందరం కలిసి పోరాడదామన్నా… సరే రెడీ అనుకున్న జనసైనికులకు .. ఇప్పటికీ.. పోరాట ఆశ నెరవేరడం లేదు.

క్లైమాక్స్ లో అయినా కొట్టేద్దాం.. చలోరే..చలోరే చల్..!

ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదు.. జనసేనాని. సైన్యం అంతా సకల సిద్ధంగా ఉంది. ప్రత్యేకహోదా అంశానికి ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గలేదు. అందరూ.. తలా ఓ కార్యక్రమం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికైనా.. పాత ప్రణాళికలైనా.. కొత్త ప్లాన్లైనా… జనసేనానితో కలిసి అడుగేసేందుకు.. సైన్యం సకల సిద్ధంగా ఉంది. యుద్ధానికి బరి రెడీ చేసి పోరాటానికి.. ” చలోరే.. చలోరే.. చల్ ..” అని పిలుపునివ్వడమే ఆలస్యం. మేమంతా రెడీగా ఉన్నాం..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close