రాజాసాబ్‌: సెకండాఫ్‌… స్పెల్‌బౌండ్!

‘స‌లార్‌’తో మ‌రో సూప‌ర్ హిట్టు కొట్టాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు త‌న దృష్టంతా క‌’ల్కి’, ‘రాజాసాబ్‌’ల‌పై ఉంది. రెండింటికీ త‌న కాల్షీట్లు పంచుతున్నాడు. రాజాసాబ్ చిన్న చిన్న షెడ్యూల్స్‌తో మెల్ల‌గా పుంజుకొంటోంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈరోజు నుంచి హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. హీరోయిన్లు, కమెడియ‌న్ల‌తో కొన్ని స‌ర‌దా స‌న్నివేశాల్ని లాగించేస్తున్నాడు మారుతి. రెండు మూడు రోజుల్లో ప్ర‌భాస్ కూడా ఈ సెట్లో అడుగు పెట్ట‌బోతున్నాడు.

మారుతి సినిమాల‌న్నీ స‌ర‌దాగా సాగిపోతుంటాయి. చిన్న చిన్న ఎమోషన్స్‌ని ఆయ‌న బాగా హ్యాండిల్ చేస్తారు. అయితే… రాజా సాబ్ లో మాత్రం ట్విస్టులు, ట‌ర్న్‌లు అదిరిపోనున్నాయ‌ని టాక్‌. ముఖ్యంగా సెకండాఫ్ ని మారుతి చాలా బాగా తీర్చిదిద్దాడ‌ట‌. ఇటీవ‌ల ప్ర‌భాస్‌కి సెకండాఫ్ మ‌రోసారి నేరేట్ చేస్తే… ప్ర‌భాస్ స్పెల్ బౌండ్ అయిపోయాడ‌ని టాక్. క్లైమాక్స్ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉండ‌బోతోంద‌ని, ప్ర‌భాస్ న‌యా అవ‌తార్ అభిమానుల్ని సైతం స‌ర్‌ప్రైజ్ చేస్తుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. సాధార‌ణంగా మారుతిపై ఎంట‌ర్‌టైన్‌మెంట్ ముద్ర గ‌ట్టిగా ప‌డిపోయింది. ఈ సినిమాలో అది అందిస్తూనే ఓ కొత్త ఇమేజ్‌ని సంపాదించుకోవ‌డానికి మారుతి గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. అది వ‌ర్క‌వుట్ అయితే, దానికి ప్ర‌భాస్ ఇమేజ్‌, స్టార్ డ‌మ్ క‌లిసొస్తే.. ‘రాజాసాబ్‌’ లెక్క వేరేలా ఉంటుంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేసే స‌న్నాహాల్లో ఉంది నిర్మాణ సంస్థ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close