వల్లభనేని వంశీతో సంబంధం లేదని చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యేలకు సందేశం !

తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైసీపీలో చేరి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం అత్యంత అసహ్య కరంగా కామెంట్లు చేసిన వల్లభనేని వంశీకి ఇప్పుడు వైసీపీలో గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వంశీని బండ బూతులు తిడుతున్నారు. తాజాగా పుట్ట పర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వల్లభనేనిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు ఆయనతో వైసీపీకి ఏం సంబంధం లేదని ప్రశ్నించారు. ఆయన టీడీపీ బీఫాంపై గెలిచాడన్నారు. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే రఘునాథరెడ్డి గౌరవసభల పేరుతో గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీనికి కౌంటర్‌గా శ్రీధర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

శ్రీధర్ రెడ్డి మాత్రమే కాదు.. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే మాట చెబుతున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి సహా అనేక మంది అసలు వంశీకి వైసీపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేసేలా ఉండటంతో ఇప్పుడు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయనకు పార్టీతో సంబంధం లేదని పదే పదే .. ఎమ్మెల్యేలతో చెప్పిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

వంశీ.. వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి వచ్చి నసూచనల మేరకే.. సాక్షి ప్రతినిధిని మాత్రమే పిలిపించుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన స్వతహాగా అన్నవి కావు. టీడీపీలో ఎప్పుడు ఎవర్ని ఎలా తిట్టారో వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి నాయకులకు సూచనలు వస్తాయి. ఇప్పుడు వంశీని దూరం పెట్టాలని.. ఆయనకు వైసీపీతో సంబంధం లేదని చెప్పాలన్న సూచనలు కూడా అలాగే వస్తున్నాయంటున్నారు. అదే జరిగితే.. వంశీ రెంటికి చెడ్డ రేవడి అవడమే కాదు.. రాజకీయంగా.. వ్యక్తిగతంగా కూడా తీవ్రమైన దెబ్బతినడం ఖాయమని అనుకోవచ్చని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close