గృహహింస కేసు.. కన్నా ఫ్యామిలీకి రూ. కోటి జరిమానా !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ కుమారుల కుటుంబసభ్యులు ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి. తాజా ఆయన పెద్ద కొడుకు, గుంటూరు మాజీ మేయర్ కన్నా నాగరాజు తన భార్యను వేధిస్తున్న కేసులో రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. అలాగే కన్నా నాగరాజు భార్యను కుమార్తె సహా కన్నా ఇంట్లోనే ఉండనివ్వాలని అలా ఉండనివ్వకపోతే.. ప్రతి నెలా రూ . యాభై వేలు చెల్లించాలని ఆదేశించింది.

కన్నా నాగరాజు 2006లో శ్రీలక్ష్మి కీర్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి కౌషిక మానస అనే పాప ఉంది. అయితే తర్వాత కన్నా నాగరాజు తన భార్యను వేధించడం ప్రారంభించాడు. వివాహేతర బంధం పెట్టుకుని వేధించడం ప్రారంభించారని.. తనను పెళ్లి చేసుకోకపోతే.. రూ. కోట్ల కట్నం వచ్చేదని అనేవారని చెబుతూ గృహహింస కేసు పెట్టారు. 2015 నుంచి తనను ఇంట్లోకి రానివ్వడం లేదన్నారు. ఈ కేసు విచారణ జరిపిన విజయవాడ కోర్టు కన్నా లక్ష్మినారాయణ, ఆయన సతీమణి కన్నా విజయలక్ష్మి, కన్నా నాగరాజులు రూ. కోటి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

మూడు నెలల్లోపు కన్నా నాగరాజు భార్యకు ఈ రూ. కోటి అందించాలని.. అలాగే ఇంట్లో నివాస వసతి కల్పించాలని.. లేకపోతే నెలకు రూ. యాభై వేలు ఇవ్వాలని ఆదేశించారు. వైద్య ఖర్చుల కోసం మరో రూ. యాభై వేలు ఇవ్వాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మూడు నెలల్లోపు ఇవన్నీ ఇవ్వాలని లేకపోతే.. పన్నెండు శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించారు. కన్నా లక్ష్మినారాయణకు ఇద్దరు కుమారులు కాగా..ఇద్దరూ లవ్ మ్యారేజీ చేసుకున్నారు. ఇద్దరీ కుటుంబాల్లోనూ సమస్యలు వచ్చాయి. చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య 2020 మేలో హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close