సుబ్బారెడ్డి వర్సెస్ అఖిలప్రియ..! ఎవరూ తగ్గట్లేదు..!

భూమా నాగిరెడ్డి చనిపోయేవరకూ ఆయనకు కుడిభుజంగా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు.. ఆయన కుమార్తె భూమా అఖిలప్రియపై ఆరోపణలు చేస్తూ.. రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నారు. అఖిలప్రియ దంపతులు తనను చంపారని సుపారీ ఇచ్చారంటూ.. సంచలన వ్యాఖ్యలతో మీడియా ముందుకు వచ్చారు. అయితే.. పోలీసులు ఆ విషయాన్ని చెప్పలేదు. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర చేశారంటూ.. ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠాకు సుపారీ ఇచ్చారని కూడా పోలీసులు గుర్తించారు. ఎవరు ఇచ్చారు..? ఎందుకు ఇచ్చారు..? అలాంటి వివరాలు బయట పెట్టలేదు. కానీ.. ఏవీ సుబ్బారెడ్డి మాత్రం.. ఆ సుపారీ ఇచ్చింది అఖిలప్రియ దంపతులేనంటూ మీడియా ముందుకొచ్చేశారు. దీనిపై అఖిలప్రియ మండిపడ్డారు. పోలీసులు చెప్పకుండా.. ఇలా ఆరోపణలు చేయడం ఏమిటన్నారు.

వెంటనే.. ఏవీ సుబ్బారెడ్డి అఖిలప్రియ వ్యాఖ్యలు స్పందించారు. తనకు పోలీసులే చెప్పారని…అందుకే తాను ప్రకటించానని చెప్పుకొచ్చారు. భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి ల రాజకీయ జీవితానికి తన ప్రాణాలు అడ్డేసి.. అనేక సందర్భాల్లో వ్యవహరించానని బాంబు దాడులను ఎదుర్కొన్నానన్నారు. ఇప్పుడు వారి కుమార్తె తనను చంపడానికి సుపారి ఇచ్చేంత తప్పు తానేం చేశానని ఆయన ప్రశ్నిస్తున్నారు. తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో కానీ.. భూమా కుటుంబానికి తనకు మధ్య ఆర్థిక లావాదేవీలు లేనని ఆయన స్పష్టం చేశారు. ఏవీ సుబ్బారెడ్డి పేరు ఏమైనా నాగిరెడ్డికి చెందిన బినామీ ఆస్తులు ఉంటే.. ఏవీ సుబ్బారెడ్డికే చెందుతాయని.. భూమా అఖిలప్రియ కూడా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఏవీ సుబ్బారెడ్డి చెప్పి.. తమ మధ్య ఆర్థిక వివాదాలు లేవని తేలిపోయిందంటున్నారు.

ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఒకే పార్టీలో ఉండి… ఇలా ఒకరిపై ఒకరు సీరియస్‌గా హత్యయాత్నాలు.. సుపారీ ఆరోపణలు చేసుకుంటూండటం.. ఆ పార్టీలో కలకలం రేపుతోంది. అయితే.. అది కర్నూలు జిల్లా టీడీపీ నేతలు కుటుంబ సమస్యగా చూస్తున్నారు. అయితే.. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు సుపారీని… భూమా అఖిలప్రియ దంపతులు ఇచ్చి ఉంటే పోలీసులు ఆ విషయాన్ని బయట పెట్టాలి కానీ.. ఏవీ సుబ్బారెడ్డికి మాత్రమే చెప్పడం ఏమిటన్న చర్చ అక్కడి రాజకీయవర్గాల్లో వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close