జగన్ తో భేటీకి బాలయ్యను ఆహ్వానించాం, కానీ రావట్లేదు : నిర్మాత సి.కళ్యాణ్

చిరంజీవి నేతృత్వంలో ఇటీవల కేసీఆర్ ని కలిసిన సినీ పరిశ్రమ పెద్దలు త్వరలో ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఏపీ లో షూటింగ్ అనుమతులు, సింగిల్ విండో అనుమతుల విధానం, రాయితీలు, పరిశ్రమకి కావలసిన ప్రోత్సాహకాల విషయంలో సీఎం జగన్ తో చిరంజీవి నేతృత్వంలోని బృందం చర్చించనుంది. అయితే ఈ భేటీకి కూడా బాలకృష్ణ హాజరు కావడం లేదని నిర్మాత సి.కళ్యాణ్ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల కెసిఆర్ తో సినీ పరిశ్రమ పెద్దలు భేటీ అయి సినీ పరిశ్రమ సమస్యల గురించి చర్చించిన తర్వాత ఆ భేటీకి తనను పిలవలేదంటూ బాలకృష్ణ అలిగిన సంగతి తెలిసిందే. తనకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కూర్చుని ఈ సినీ పెద్దలు భూములు పంచుకుంటున్నారా అని ఆయన ఆక్రోశాన్ని వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో సినీ పెద్దలు ఏపీ సీఎం జగన్ తో భేటీకి బాలకృష్ణ ని కూడా ఆహ్వానించారు. అయితే సినీ పరిశ్రమకు జగన్ అపాయింట్మెంట్ జూన్ పదవ తేదీన కుదిరింది. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ, ఏపీ సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇచ్చిన తేదీ బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో, ఆయనను మేము ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరు కాలేకపోతున్నారు అంటూ ప్రకటించారు. ఇటీవల తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల లో జరిగిన ఇండస్ట్రీ సమావేశాలలో చాలావాటికి బాలకృష్ణ హాజరు కాలేకపోయారు అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అయితే నిర్మాత కళ్యాణ్ బాలకృష్ణ హాజరు కాలేక పోతున్నారని ప్రకటించినప్పటికీ, బాలకృష్ణ కూడా ఈ సమావేశానికి హాజరు అయితే బాగుంటుందనే అభిప్రాయం సినీ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఆయన హాజరైతే, సినీ పరిశ్రమ వివాదాలు సద్దుమణిగి పోయాయన్న సంకేతాన్ని ఇవ్వడం తో పాటు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ వైఎస్సార్సీపీ నేత జగన్ ని కలిస్తే, పార్టీలకతీతంగా సినీ పరిశ్రమ కోసం బాలకృష్ణ ముందడుగు వేశారని సంకేతం కూడా వెలువడినట్లు అవుతుంది అని సిని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆహ్వానం మేరకు బాలకృష్ణ జగన్ భేటీకి హాజరు అవుతాడా లేక తన పుట్టినరోజు వేడుకల్లోనే నిమగ్నం అవుతారా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close