పవన్ డిమాండ్‌ను అంగీకరించిన సీఎం.. !

కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి అనే విద్యార్థిని హత్య ఉదంతంపై పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం ముఖ్యమంత్రి కర్నూలు పర్యటనకు రావడంతో.. వైసీపీ నేతలు, అధికారులు.. సుగాలి ప్రీతి తల్లిని.. ఆయన వద్దకు తీసుకెళ్లారు. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసిన సుగాలి ప్రీతి తల్లి… తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరారు. దీనికి స్పందించిన జగన్మోహన్ రెడ్డి… ఆ కేసును సీబీఐకి ఇస్తున్నామని .. భరోసా ఇచ్చారు. న్యాయచేస్తామని ధైర్యం చెప్పారు.

తెలుగుదేశం ప్రభుత్వం హయంలో.. 2017లో జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసులో చాలా కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. పోలీసుల దర్యాప్తు తీరుపై అనేక అనుమానాలు తలెత్తాయి. అప్పట్లో పాలక పక్షం కానీ.. ప్రతిపక్షం కానీ.. ఈ కుటుంబానికి న్యాయం చేయడానికి .. పోరాటం చేయడానికి ముందుకు రాలేదు. ఆలస్యంగా తన దృష్టికి వచ్చినప్పటికీ పవన్ కల్యాణ్.. సుగాలి ప్రీతి కుటుంబం కోసం… పోరాడాలని నిర్ణయించుకున్నారు. గతంలోనే.. ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన ఆయన స్పందించకపోవడంతో.. కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించి.. సీబీఐ విచారణ జరిపించే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. వైసీపీ మద్దతుదారులైన కొంత మంది .. పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో… నిందితులకు వైసీపీ కొమ్ము కాస్తోందన్న ఆరోపణలు బాధితుల వైపు నుంచి వచ్చాయి.

అదే సమయంలో.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అత్యాచారం, హత్య జరిగింది టీడీపీ హయాంలో కదా..అని తేలిగ్గా మాట్లాడిన వ్యవహారం కూడా.. సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం పెరిగి పెద్దదయితే.. దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చి మహిళల భద్రత కోసం..కృషి చేస్తున్న తమకు ఇబ్బందికరమన్న ఉద్దేశంతో… సీబీఐకి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సుగాలి ప్రీతి కుటుంబానికి హామీ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close