నింగికేగిన రెండు ఎర్ర బిందువులు..!

ప్రజా ఉద్యమాల కోసం జీవితం అంకితం చేసిన వంగపండు ప్రసాదరావు, సున్నం రాజయ్య కన్నుమూశారు. ఒకరు కరోనాతో చనిపోగా.. మరొకరు.. గుండెపోటుతో మృత్యువును ఆహ్వానించారు. ఇద్దరూ… ప్రజాచైతన్యం కోసం పోరాడిన వారే. ఒకరు కళలతో… ప్రజలను మేల్కొలిపే ప్రయత్నం చేయగా.. మరొకరు ప్రజా జీవితంలో ఉండి వారి కోసం నిరంతరం పాటుపడ్డారు. నేటి తరం.. ఇలా కూడా ఉండగలరా అని ఆశ్చర్యపోయే జీవన శైలితో వారి.. జీవితాంతం.. ఓ సిద్దాంతానికే కట్టుబడ్డారు.

వంగపండు ప్రసాదరావు అని పూర్తి పేరు చెబితే చాలా మందికి తెలియదు కానీ.. వంగపండు అంటే.. మాత్రం.. “ఏం పిల్లడో యెల్దమొస్తవా…” అంటూ ఉత్తరాంధ్ర జానపదాలు.. పెదాలపైకి రావడం సహజం. 77 ఏళ్ల వంగపండు తన జీవితాంతం…ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ప్రయత్నించారు. 1972 జననాట్య మండలిని స్థాపించారు. గద్దర్‌తో కలిసి పని చేశారు. వందలాది ఉత్తరాంధ్ర జానపదాలకు వంగపండు గజ్జెకట్టారు. విప్లవ కథాంశాలతో నిర్మించే సినిమాలకు కూడా పాటలు అందుకున్నారు. అర్థరాత్రి స్వతంత్య్రం సినిమాతో ప్రారంభించి.. అనేక పాటలు శారు. ఆర్ నారాయణమూర్తితో ఆయనకు మిత్రుత్వం ఎక్కువ. అయితే కళను ఏనాడూ ఆయన డబ్బులతో వెల కట్టలేదు. చివరి రోజుల్లో పార్వతీపురంలోని తన ఇంట్లోనే కన్ను మూశారు.

ప్రజా జీవితంలో నిస్వార్థంగా బతికిన మరో నేత… సున్నం రాజయ్య. కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెంలో ఉంటున్న ఆయనను వైద్య చికిత్స కోసం విజయవాడ తరలిస్తూండగా కన్నుమూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడు సార్లు సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు వచ్చే జీతాన్ని కూడా.. పార్టీకే విరాళంగా ఇచ్చేవారు. ప్రజల కోసం.. నిస్వార్థంగా పని చేశారు. ఒక్క సారి ఎమ్మెల్యే అయితేనే… రూ. కోటి కారులో తిరిగే నేతలు ఉన్న కాలంలో.. ఆయన గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు.

ఇప్పుడు… డబ్బులు సంపాదించుకునేవారే గొప్పవారు . ప్రజల కోసం ఎవరైనా పని చేస్తారంటే.. వారిని వింతగా చూసే పరిస్థితులు వచ్చాయి. అందుకే…రాలిపోతున్న కమ్యూనిస్టుల గురించి చెప్పుకున్న ప్రతీ సారి… ప్రజలు ఏం కోల్పోతున్నారో గుర్తుకొస్తూ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close