జగన్ అక్రమాస్తుల ఈడీ కేసుల్లో సుప్రీంకోర్టు నోటీసులు !

సీబీఐ కేసులు, ఈడీ కేసులు నమోదైతే.. మొదట సీబీఐ కేసులు విచారణ జరపాలని.. ఆ కేసులు తేలిపోతే.. ఈడీ కేసులు కూడా చెల్లవని.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేయకపోతే.. ఈడీ , సీబీఐ కలిసి పెడుతున్న కేసులన్నీ తేలిపోయే ప్రమాదం ఉండటంతో ఆలస్యంగానైనా సవాల్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఈడీ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌, విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది.

ఈ కేసు పూర్తి స్థాయి విచారణ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలా.. లేక త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలన్నది ఆరోజు నిర్ణయిస్తామని సెప్టెంబర్ 5వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా జప్తు చేసిన భారతి ఆస్తుల విడుదలకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ కేసు విచారణ ఈనెల 14న సుప్రీంకోర్టులో జరగనుంది. జప్తు ఆస్తులకు సమాన విలువైన ఎఫ్‌డీలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ఈడీ సవాల్ చేసింది.

మరో వైపు సీబీఐ కోర్టులో చాలా రోజుల తర్వాత అక్రమాస్తులపైసీబీఐ కేసుల విచారణలు ప్రారంభమయ్యాయి. మొదట నిందితులు గత పదేళ్లుగా ఒకరి తర్వాత ఒకరు దాఖలు చేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్లను నెలాఖరులోపు విచారణ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అసలు కేసుల విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close