కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల అహంకారం మామూలుగా ఉండదు. వారితో పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ, తామే పార్టీని నడుపుతున్నట్లు కలరింగ్ ఇస్తారు. అలాంటి వారిని కాంగ్రెస్ ఎక్కువగా మోయడం వల్లే ఆ పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది. ఏఐసీసీ స్థాయిలోనే కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ సీనియర్లది ఇదే తీరు. అలాంటి నేతలపై రాహుల్ గాంధీకి కోపం వచ్చేసింది. ఎలాంటి మొహమాటం లేకుండానే కర్కశంగా మాట్లాడేశారు.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో పర్యటించిన రాహుల్ గాంధీ…సీనియర్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పదుల సంఖ్యలో కీలక నేతలు ఉన్నారు. అయినా పార్టీని పవర్ లోకి తీసుకురాలేకపోతున్నారు. మధ్య ప్రదేశ్ పాలిటిక్స్ ను ప్రభావితం చేస్తామని అనడం కాదు.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వారు ముఖ్య నేతలు అంటూ రాహుల్ గాంధీ సీనియర్లకు వాతలు పెట్టేశారు. పని చేయడం మానేసి..సీఎం పదవి కోసం పదుల సంఖ్యలో పోటీలో ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీనియర్లమని చెప్పుకునే నేతలు ఇక నిర్లక్ష్యం వీడాలి.. తాము ముఖ్య నేతలమని కామ్ గా ఉంటే కుదరదు అంటూ రాహుల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో కొనసాగుతూ ఇతర పార్టీలకు అనుకూలంగా పని చేసే నేతలు తమకు అక్కర్లేదు..ఎలాంటి అనుమానాలు అక్కర్లేకుండా వెళ్లిపోవచ్చునని సీరియస్ కామెంట్స్ చేశారు. పార్టీలో స్లీపర్ సెల్స్ పై ఫోకస్ పెట్టామని, కనిపెట్టి బయటకు పంపుతామని కీలక వ్యాఖ్యలు చేశారు.