పీసీసీ అధ్యక్షుడు కోసం రహస్య సర్వే

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగాను మరో ఇద్దరిని కార్యనిర్వాహక అధ్యక్షులుగాను నియమించాలని అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్ష పదవి తీసుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోతే తెలంగాణలో మాత్రం పోటీ ఎక్కువగా ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు తెలంగాణ పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించడమే కాకుండా పార్టీని పటిష్ట పరిచేందుకు అధిష్టానం సత్తా ఉన్న నాయకుడి ఎంపికలో పడింది. ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి దూకుడు మీద ఉన్న రేవంత్ రెడ్డి పీసీసీ రేసులో ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు, ముగ్గురు నాయకులు కూడా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఈ దశలో రహస్య సర్వే ద్వారా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే ఈ సర్వే పని ప్రారంభమైనట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో సీనియారిటీతో పాటు అందర్నీ కలుపుకొని వెళ్లే నాయకత్వ లక్షణాలు ఉన్నవారు, కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకొని సర్వే చేస్తున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సర్వేలో పార్టీ అధ్యక్షుడి ఎంపికతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏ అంశంలో ప్రజలకు దూరం అయింది అనే విషయాలను కూడా స్థానిక ప్రజల నుంచి రాపడుతున్నట్టు సమాచారం. శాసనసభ ఎన్నికలకు మూడు సంవత్సరాల సమయం ఉండడంతో ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్లి పని చేసే నాయకుడి ఎంపిక జరగాలని, గ్రూపు వివాదాలకు ఇక ఎలాంటి అవకాశం ఇవ్వరాదన్నది అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. అధిష్టానం నిర్వహిస్తున్న సర్వే ఆధారంగానే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close