తొక్కిసలాట మృతులపై స్వామీజీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: హిందూ ధర్మ ప్రచారసమితి కన్వీనర్ కమలానందభారతి స్వామీజీ నిన్న రాజమండ్రిలో తొక్కిసలాట దుర్ఘటనలో చనిపోయినవారిగురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మృతుల బంధువులకు బాధ ఉంటుందని, అయితే ఆధ్యాత్మిక కోణంలో చూస్తే చనిపోయిన వారంతా వైకుంఠప్రాప్తి పొందినట్లేనని చెప్పారు. అదృష్టం ఉండటంవలనే ఆ 27మందీ అలా మరణించారని, అది ఎవరికీ సాధ్యంకాదని అన్నారు. వారందరికీ మోక్షప్రాప్తి కలిగిందని, ఈ దుర్ఘటనను ఇలాగే పరిగణించాలని ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మృతుల బంధువులు ఆ బాధను అధిగమించి ముందుకు పోవాలని అన్నారు. నదిలో మనం కొద్దిగా నీరు తీసుకుంటే నదికేమీ లోటుండదని, అలాగే ఒక కార్యక్రమం జరుగుతుంటే ఒక ఘటన జరిగితే మిగతా కార్యక్రమాన్ని జారవిడుచుకోవాల్సిన అవసరంలేదని చెప్పారు. అన్నట్లు ఈ స్వామీజీ 2013 సంవత్సరంలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించినందుకుగానూ అరెస్టయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close