తొక్కిసలాట మృతులపై స్వామీజీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: హిందూ ధర్మ ప్రచారసమితి కన్వీనర్ కమలానందభారతి స్వామీజీ నిన్న రాజమండ్రిలో తొక్కిసలాట దుర్ఘటనలో చనిపోయినవారిగురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మృతుల బంధువులకు బాధ ఉంటుందని, అయితే ఆధ్యాత్మిక కోణంలో చూస్తే చనిపోయిన వారంతా వైకుంఠప్రాప్తి పొందినట్లేనని చెప్పారు. అదృష్టం ఉండటంవలనే ఆ 27మందీ అలా మరణించారని, అది ఎవరికీ సాధ్యంకాదని అన్నారు. వారందరికీ మోక్షప్రాప్తి కలిగిందని, ఈ దుర్ఘటనను ఇలాగే పరిగణించాలని ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మృతుల బంధువులు ఆ బాధను అధిగమించి ముందుకు పోవాలని అన్నారు. నదిలో మనం కొద్దిగా నీరు తీసుకుంటే నదికేమీ లోటుండదని, అలాగే ఒక కార్యక్రమం జరుగుతుంటే ఒక ఘటన జరిగితే మిగతా కార్యక్రమాన్ని జారవిడుచుకోవాల్సిన అవసరంలేదని చెప్పారు. అన్నట్లు ఈ స్వామీజీ 2013 సంవత్సరంలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించినందుకుగానూ అరెస్టయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close