ఏపీ రాజధాని అమరాతి. ఇది తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత ఇక్కడ రియల్ బూమ్ వచ్చింది. వైసీపీ హయాంలో నేలకు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటోంది.
తాడికొండ అమరావతి రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉండటం వల్ల, ఇక్కడ ప్లాట్లు ,రెసిడెన్షియల్ ఆస్తులపై డిమాండ్ కనిపిస్తోంది. కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆమోదం పొందిన లేఅవుట్లకు ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. అమరావతి ప్రాజెక్ట్ ఆలస్యం కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత మందగించినప్పటికీ, 2024-2025లో మౌలిక సదుపాయాల అభివృద్ధి , ప్రభుత్వ ప్రాజెక్ట్లపై స్పష్టత రావడంతో మార్కెట్ మళ్లీ ఊపందుకుంది. రెసిడెన్షియల్ ప్లాట్లతో పాటు, అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం జరుగుతోంది.
తాడికొండ పరిసర ప్రాంతాల్లో 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ధర సుమారు 15 లక్షల వరకూ చెబుతున్నారు. ప్రధాన రహదారులు, అమరావతి సమీపంలోని ప్లాట్లు ఎక్కువ రేటు ఉంటున్నాయి. ఇళ్ల నిర్మాణం జరిగే చోట సహజంగానే ఎక్కువ ధరలు చెబుతున్నారు. సగటున గజం పది వేల నుంచి ఇరవై వేల వరకూ ఉందని అనుకోవచ్చు. అమరాతి నిర్మాణం ఊపందుకుంటే.. ధరలు అనూహ్యంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.