దానంతో తలసాని చర్చలు: టీఆర్ఎస్‌లోకి జంప్?

హైదరాబాద్: తెలంగాణ వాణిజ్యపన్నులు, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇవాళ కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానంనాగేందర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇరువురు నేతలూ దాదాపు 20నిమిషాలపాటు భేటీ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన తలసాని, ఈ భేటీకి ప్రాధాన్యత ఏమీ లేదని, బోనాలకు ఆహ్వానించటానికే వచ్చానని అన్నారు.

అయితే ఈ భేటీపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. దానం నాగందర్ టీఆర్ఎస్‌లో చేరతారని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. అయితే దానం ఇటీవల ఆ వార్తలను తిరస్కరించారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. టీఆర్ఎస్‌కు గ్రేటర్ హైదరాబాద్‌లో విజయావకాశాలు తక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. ఎమ్ఐఎమ్ పార్టీతో పొత్తు అయినా ఉపయోగపడుతుందనుకుని వారిని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తే, తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీచేస్తామని అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల ప్రకటించటంతో ఆ ప్రయత్నమూ విఫలమయింది. ఇలాంటి పరిస్థితులలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్‌కు ఒక పెద్ద దిక్కు అవసరం స్పష్టంగా కనబడుతోంది. నగరంలో ఎంతో పట్టున్న దానం నాగేందర్ కనుక పార్టీలో చేరితే గ్రేటర్‌లో విజయావకాశాలు మెరుగుపరుచుకోవచ్చని టీఆర్ఎస్ నాయకత్వం యోచిస్తున్నట్లు కనబడుతోంది. అందుకే తలసానితో దానందగ్గరకు రాయబారం పంపినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి టీడీపీలో ఉన్న తలసాని బోనాలుకు కేసీఆర్‌ను ఆహ్వానించటం, దరిమిలా టీఆర్ఎస్‌లో చేరటం తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close