తలసానికి ఇప్పటికి ధైర్యం వచ్చిందండోయ్‌!

దాదాపు ఏడాదిరోజులు గడచిపోయాయి. ఆయనేమో తాను ‘తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసాను’ అంటారు. కానీ.. స్పీకరు మాత్రం ఆయన రాజీనామాను ఆమోదించరు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే హోదాలోనే ఉంటూ.. ఇటు తెరాస మంత్రిగా ఆయన పరిపాలన లో భాగస్వామిగా మారిపోయి చెలరేగుతున్నారు. మరోవైపు తెదేపా వాళ్లంతా.. ఆయన మీద అనర్హత వేటు వేయాల్సిందేనంటూ కోర్టు ద్వారా గవర్నరు ద్వారా రాష్ట్రపతి ద్వారా తమకు చేతనైన అన్ని మార్గాల్లోనూ విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఉప ఎన్నిక గురించి ఎన్నడూ పెదవి విప్పని.. తలసాని శ్రీనివాసయాదవ్‌ ఇన్నాళ్లకు ఇప్పుడు మాట్లాడుతున్నారు. తాను ఉప ఎన్నికకు భయపడనని, ఎప్పుడైనా ఎన్నికకు సిద్ధంగా ఉంటానని అంటున్నారు.

మొత్తానికి గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలను గమనించిన తర్వాత.. ఇప్పుడు తలసానికి ధైర్యం వచ్చినట్లుంది. దాదాపు ఏడాదిరోజులుగా తన అర్హతలు అభ్యర్థిత్వం, మంత్రి పదవి గురించి అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్‌ పార్టీలు నానా యాగీ చేస్తున్నప్పటికీ.. నేను రాజీనామా చేసేసాను. ఇక ఆమోదాలు, ఇతర పర్యవసానాలతో నాకు నిమిత్తం లేదు అంటూ మౌనం పాటిస్తూ వచ్చిన తలసాని శ్రీనివాసయాదవ్‌.. గ్రేటర్‌ లో తన నియోజకవర్గం ప్రజలు కూడా పెద్దఎత్తున తెరాసకు పట్టం కట్టడంతో గుండెధైర్యాన్ని చిక్కబట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

సనత్‌ నగర్‌ నియోజకవర్గం తెలుగుదేశానికి చాలా స్ట్రాంగు నియోజకవర్గం అనే ధీమాతోనే ఆయనను దమ్ముంటే రాజీనామా చేయాలంటూ తెదేపా వారు గతంలో పదేపదే అంటూ వచ్చారు. అదే మాదిరిగా గతంలో అక్కడినుంచి ప్రాతినిధ్యం వహించిన మర్రి శశిధర్‌రెడ్డి కూడా.. కాంగ్రెస్‌కు బలమైన సీటు అనే ఉద్దేశంతో ఇదే సవాలు చేస్తూ వచ్చారు. తలసాని జనాన్ని మోసం చేశారని.. జనం మాత్రం ఈ రెండు పార్టీలవైపునే ఉన్నారని వారు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ.. ఫలితాలు వెల్లడయ్యేసరికి అంతా తేడా అయిపోయింది. అందరూ ఉమ్మడిగా కేసీఆర్‌ వెంట ఉన్నారనే నమ్మకం చిక్కిన తర్వాత.. ఇక ఉప ఎన్నిక వచ్చినా పర్లేదనే భావనకు తలసాని తెగించినట్లుగా పలువురు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close