స్టాలిన్ : ఈయనా సాధారణ ‘రాజకీయ స్పీకరే’…!

‘జూలియస్‌ సీజర్‌’ నాటకంలోని ‘యూ టూ బ్రూటస్‌’ అనే వాక్యం చాలా పాపులర్‌. దాన్నో సామెత మాదిరిగా వాడుతుంటారు. ‘బ్రూటస్‌ నువ్వు కూడానా?’ …అంటాడు రాజు తనను చంపుతున్న సన్నిహితుడు బ్రూటస్‌తో. బ్రూటస్‌ నువ్వు కూడా అందరిలాంటి ద్రోహివేనన్నమాట అని రాజు భావం. ఏ ప్రత్యేకతా లేకుండా అందరి మాదిరిగానే అదే మూసలో వెళ్లేవారిని యూ టూ బ్రూటస్‌ అంటుంటారు ఈ రోజుల్లో. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం బ్రూటస్‌లాంటోడేనని చెప్పొచ్చు. అంటే ఈయనకు ఏ ప్రత్యేకతా లేదని, గతంలో పనిచేసిన కొందరు రాజకీయ స్పీకర్లలాంటివాడే ఈయన కూడా అని చెప్పుకోవల్సివస్తోంది.

‘రాజకీయ స్పీకర్‌’ అనే మాటలోనే ఈయన నిష్పాక్షిక స్పీకర్‌ కాదని, వైకాపా మనిషిగా పనిచేస్తున్న స్పీకర్‌ అనేది అర్థమవుతోంది కదా. రాజ్యాగం ప్రకారం స్పీకర్‌ పదవి సమున్నతమైంది. దానికి హుందాతనం, గౌరవం ఉన్నాయి. ‘అందరి బంధువయా’ అన్నట్లుగా స్పీకర్‌ అందరివాడు. అంటే అన్ని పార్టీలను రాజకీయాలకతీతంగా చూడాల్సినవాడు. రాజకీయాల బురద అంటించుకోకుండా ఉండాల్సినవాడు. సభా నిర్వహణలో సంయమనం పాటించాల్సినవాడు. అధికార పార్టీకి చెందినవాడు అయినప్పటికీ ఆ పార్టీతో అంటకాగకుండా ఉండేవాడు. సభలో అధికార పార్టీ ఆధిపత్యాన్ని అడ్డగించి ప్రతిపక్షాలకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వాల్సినవాడు. బయట కూడా రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు మాట్లాడకుండా ఉండేవాడు….ఇలాంటి లక్షణాలన్నీ స్పీకరుకు ఉండాలి.

కాని ఇప్పటి స్పీకర్లు ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్లు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. ఏ నాయకుడినైనా స్పీకరు పదవికి ఎంపిక చేసేది అధికార పార్టీయే. అంటే ముఖ్యమంత్రే. స్పీకరుగా ఎన్నికయ్యాక సదరు నాయకుడు తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి. కాని ఇప్పటి స్పీకర్లు ముఖ్యమంత్రికి నమ్మిన బంట్లలా ఉన్నారు. తమ్మినేని సీతారాం ఇలాగే వ్యవహరిస్తున్నాడు. అసెంబ్లీలో ఆయన పాత్ర సంగతి అలా ఉంచుదాం. బయటమాత్రం ఆయన పక్కా వైకాపా నాయకుడిలా వ్యవహరిస్తున్నాడు. ఆయన మాటలు,వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. చివరకు పబ్లిగ్గా బూతులు మాట్లాడుతున్నారు. ఆయన స్పీకరైనప్పుడు కొన్ని పత్రికలు ‘తమ్మినేని సౌమ్యుడు’ అని రాశాయి. కాని ఆయన మాటతీరు అందుకు విరుద్ధంగా ఉంది.

సీఎం వైఎస్‌ జగన్‌ భజన బృందంలో తమ్మినేని ముఖ్యపాత్రే పోషిస్తున్నాడు. ‘ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టిపెరిగిన జగన్‌ గర్వించదగ్గ భారతీయ పౌరుడు’ అన్నాడీయన. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీని ఘాటుగా విమర్శించాడు. కాని సభ్యత మర్చిపోయి బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు సభ్యతకు తిలోదాకాలిచ్చి బుతూలు తిట్టుకుంటున్నారు కదా. వారు అలా మాట్లాడకుండా కట్టడి చేయాల్సిన స్పీకరు తానే బూతులు మాట్లాడితే వాళ్లకేం చెబుతాడు? ‘గతంలో చంద్రబాబు నాయుడు సోనియా గాంధీతో చేతులు కలిపి లం…త్వానికి పాల్పడలేదా?వాళ్లా జగన్మోహన్‌ రెడ్డి గురించి మాట్లాడేది? అర్థం లేని మాటలు మాట్లాడే అర్హత వారికి లేదు’…అన్నాడు తమ్మినేని.

జగన్‌కు, సోనియా గాంధీకి చాలా వ్యత్యాసం ఉందన్నాడు. ఇలా మాట్లాడి స్పీకర్‌ ఏం సాధించాడంటే, ఉన్న గౌరవం పోగొట్టుకున్నాడు. ‘తమ్మినేని రాజకీయ వ్యభిచారి’ అని టీడీపీ నాయకుడు కూన రవికుమార్‌ విమర్శించాడు. మరోపక్క కాంగ్రెసు నాయకులు విరుచుకుపడ్డారు. తమ్మినేని స్పీకర్‌ పదవి చేపట్టినప్పటినుంచి జగన్‌ని పలు సందర్భాల్లో ఆకాశానికి ఎత్తేశాడు. టీడీపీ హయాంలో కోడెల శిప్రసాదరావు కూడా పార్టీ నాయకుడిగానే వ్యవహరించాడు. పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో, సైకిల్‌ యాత్రలో పాల్గొన్నాడు. పదవిలో ఉన్నప్పుడే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఒకప్పటి స్పీకర్లు ముఖ్యమంత్రులను కూడా కట్టడి చేసి తమ నిష్పాక్షకతను చాటుకున్నారు. కాని ఇప్పటి స్పీకర్లు ముఖ్యమంత్రుల కనుసన్నల్లో మెలుగుతూ వారి కరుణాకటాక్షల కోసం వేచి చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close