తిరుపతి అభ్యర్థిని ప్రకటించేసిన చంద్రబాబు..!

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించేసింది. అసలు కసరత్తే చేయలేదని అనుకుంటున్నా.. చంద్రబాబు అందరితో మాట్లాడి.. అనూహ్యంగా అభ్యర్థిని ఖరారు చేసేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మినే అభ్యర్థిగా ఖరారు చేశారు. వైసీపీ తరపున పోటీ చేసి.. ఎంపీగా గెలిచిన బల్లి దుర్గా ప్రసాదరావు మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమయింది. ఈ ఉపఎన్నిక షెడ్యూల్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసి.. పని చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అందరూ నేతలకు.. స్పష్టమైన కార్యాచరణ ఇచ్చారు. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుకోవాలని… వైసీపీ పట్టుదలతో ఉంది. అయితే అభ్యర్థి ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ విధానం ప్రకారం.. ఎంపీ స్థానాల్లో.. ఎవరికీ పెద్దగా పరిచయం లేని వారిని నిలబెడుతూ ఉంటారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వ్యూహం పని చేస్తుందేమో కానీ ఉపఎన్నికల్లో పని చేస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే సానుభూతి కోణంలో బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబసభ్యులకే సీటు ఇచ్చే అవకాశం ఉన్న ప్రచారం కూడా వైసీపీలో జరుగుతోంది.

ఇక గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పదహారు వేల ఓట్లు తెచ్చుకున్న బీజేపీ కూడా .. గెలుపు తమదేనని ఉత్సాహపడుతోంది. రెండు, మూడు సార్లు సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. దుబ్బాక ఎన్నికల ఫలితం తర్వాత ఆ ఉత్సాహం మరింత ఎక్కువైంది. గెలిచేస్తామని ప్రకటనలు కూడా చేస్తున్నారు. బలమైన అభ్యర్థి కోసం ఇతర పార్టీల నుంచి వెదుకుతున్నారు. తిరుపతి ఉపఎన్నిక ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close