జగన్ నిద్రలో లేచి అసెంబ్లీని రద్దు చేసేస్తారట !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీకి గట్టి నమ్మకం ఏర్పడింది. జగన్ ఎప్పుడైనా నిద్రలో లేచి అసెంబ్లీని రద్దు చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఎన్నికలుక సిద్ధం కావాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా అదే చెబుతున్నారు. అంతే కాదు తమ పార్టీ పరంగా ఇప్పటికే అభ్యర్థులు ఎవరెవరు అన్న అంశంపై క్లారిటీ ఇస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్నదానికి ఓ ప్రాతిపదికను విశ్లేషకులు కొంత కాలంగా చెబుతున్నారు.

అదేమిటంటే ఆర్థికపరిస్థితి పూర్తిగా దిగజారిపోయిన సందర్భంలో జీతాలివ్వడమే కష్టంగా ఉంది..వచ్చే ఏడాది అప్పులు పుట్టని పరిస్థితి. అలాగే వివేకా హత్య కేసు ఎటు మలుపులు తిరిగి జగన్ మెడకు చుట్టుకుంటుందో అంచనా కూడా ఉంది. అలాగేఅధికార వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారం అందుకోవాలన్న ఆలోచన వైసీపీలో ఉందని జరుగుతున్నప్రచారంకూడా దీనికి కారణం. ఎప్పుడు పార్టీ నేతలతో సమావేశం జరిపినా ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని సన్నద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు సూచిస్తూ ఉంటారు.

అయితే ఎన్నికల మూడ్ పెరుగుతున్న సమయంలో పార్టీ కార్యకర్లలను సన్నద్ధం చేయడానికి టీడీపీ నేతలు ్లా చెబుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని అడుగుతున్నారు. కానీ సీఎం జగన్ నిర్ణయాలను తార్కికంగా విశ్లేషిస్తే అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ ట్రాక్ రికార్డు … ముందస్తు ఎన్నికలు అసాధ్యమేం కాదని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close