అవంతికి జగన్ భీమిలి టిక్కెట్ ఇవ్వకపోతే..? అంతేగా.. అంతేగా..!

ప్రత్యేకహోదా విషయంలో జగన్ కమిట్ మెంట్ నచ్చి ఆ పార్టీలో చేరానని ప్రకటించారు.. ఎంపీ అవంతి శ్రీనివాస్. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడు మనం కూడా చేద్దామని ఆయన చంద్రబాబుకు చెబితే వదన్నారట. రాజీనామా చేయకుండా సాధించింది ఎం ఉంది అని ఆయన ప్రశ్నించారు.. రాష్టాన్ని విభజించిన కాంగ్రెస్ తో కలిశారని.. చంద్రబాబు అవకాశవాది అని అవంతి తేల్చేశారు. రైల్వే జోన్ కోసం నేను ధర్నా చేస్తే తనను మందలించారు గుర్తు చేసుకున్నారు. తాను ఎం చెబితే ప్రజలు అదే నమ్ముతారని చంద్రబాబు భావిస్తున్నారని.. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా ఓ ఎమ్మెల్యే వల్లే రాలేదనే గుట్టు విప్పారు. ఓ ఎమ్మెల్యే అవినీతి గురించి పీఎంఓ కి సమాచారం అందిందని.. ఆ అవినీతిపై ప్రధాని సీరియస్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఆ విషయంలో బాబు, మోదీ మధ్య విబేధాలొచ్చాయని ప్రకటించారు.

తునిలో రైలు తగులబెట్టిన ఘటనలో.. కడప నుంచి మనుషులను తెచ్చారని చంద్రబాబు అన్నారని… కాపులకు రైలు తగులబెట్టే సత్తా కూడా లేదా? అని అవంతి శ్రీనివాస్‌ ఆవేశ పడ్డారు. కాపులకు జగన్‌ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు తో తాను ఏ పని అయినా చేయించుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని చాలెంజ్ చేశారు. భీమిలి టిక్కెట్ విషయంలో టీడీపీ అధినాయకత్వం నుంచి హామీ లభించకపోవడంతో.. ఆయన వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

చంద్రబాబు ఢిల్లీ దీక్షలో కూడా పాల్గొని.. ఇప్పటి వరకూ.. వైసీపీ నేతలపై చేసిన ఆరోపణలను.. ఆ పార్టీలో చేరగానే.. చంద్రబాబుపై మళ్లించారు అవంతి శ్రీనివాసరావు. ఒక్క రోజులోనే.. మొత్తానికి స్టాండ్ మార్చి… జగన్ కు బదులుగా చంద్రబాబును తిట్టడం ప్రారంభించారు. రేపు జగన్ తాను అనుకున్న భీమిలి టిక్కెట్ ఇవ్వకపోతే… మళ్లీ .. జగన్ ను ఇలాగే తిడతారేమో..? గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన.. అనేక మంది.. ఎన్నికల తర్వాత అలానే జగన్ తిట్టేసి బయటకు వచ్చారు. రాజకీయం అంటే ఇంతేనేమో.. ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close