డీపీ భక్తీ ప్రదర్శించేసిన టీడీపీ !

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆకర్షించడానికి తెలుగుదేశం తంటాలు పడుతుందో.. లేకపోతే ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుతున్న సంబంధాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందో కానీ.. కొన్ని విషయాలను పాటించేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ తమ సోషల్ మీడియా అకౌంట్లన్నింటికీ డీపీలు మార్చేసింది. త్రివర్ణ పతాకాన్ని ఉంచింది. పార్టీ.. అనుబంధ విభాగాలు.. చంద్రబాబు, లోకేష్ ఇలా అందరి డీపీల్లో జాతీయ జెండా మాత్రమే కనిపిస్తోంది.

అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అందరూ డీపీలు మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఆగస్టు రెండో తేదీ నుంచి ఈ డీపీలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మొదట పట్టించుకోలేదు. ఇప్పుడు మార్చుకున్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవాల కమిటీ మెంబర్‌గా ఉండి.. ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందించకపోతే విమర్శలు వస్తాయన్న కారణంగా టీడీపీ ఈ డీపీలు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.

తెలుగు రాాష్ట్రాల్లో ఇలా మోదీ పిలుపు మేరకు డీపీలను ఏ ఇతర రాజకీయ పార్టీ మార్చుకోలేదు. బీజేపీతో పాటు ఆ పార్టీ నేతలు డీపీలు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ నేతలు ఎలాంటి మార్పులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసుకోలేదు. డీపీలు మార్చితే జీడీపీలు పెరుగుతాయా అని టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతల తీరుపై విమర్సలు చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం ఎలాంటి విమర్శలు చేయకుండా డీపీ భక్తిని ప్రదర్శించేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close