హైవోల్టేజ్ సీన్లలో మిస్సయిన జనసేన !

రాజకీయంగా ఎంత క్రియాశీలకంగా ఉంటే ప్రజల్లో అంతగా నానుతారు. లేకపోతే జనం మర్చిపోతారు. జనసేన పరిస్థితి అదే. ఇప్పుడు ఏపీలో హై వోల్టేజ్ రాజకీయ సన్నివేశాలు నడుస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని .. టీడీపీ నేతలు బలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. మరో వైపు బీజేపీ నేతలు టీడీపీని.. టీడీపీ అధినేతను సందర్భం సృష్టించుకుని మరీ పొగుడుతున్నారు. దానికి తోడు కొత్తగా న్యూడ్ వీడియో వ్యవహారం ఉంది. అయితే ఎక్కడా జనసేన ఈ వ్యవహారాల్లో కనిపించడం లేదు.

పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ వచ్చిందని అందుకే ఆయన బయటకు రావడం లేదని చెబుతున్నారు. దాదాపుగా మూడు వారాలుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఇన్ని రోజులు బాలేదంటే అది కాస్త సీరియస్ అంశమే అనుకోవచ్చు. అయితే ఆయన యాక్టివ్‌గా లేకపోతే పార్టీ కూడా పడుకుంటుందా.. ఎలాంటికార్యక్రమాలు ఉండవా అనేది క్యాడర్‌కు వస్తున్న సందేహం. నాదెండ్ల మనోహర్ చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి.. . అప్పు తెచ్చిన ఆరు వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు కానీ ఎవరూ పట్టించుకోలేదు.

జనసేన ఎప్పటికప్పుడు ప్రజల్లో. .. ప్రచారంలో ఉండేలా తన వ్యూహాల్ని మార్చుకోవాలి. పవన్ కల్యాణ్ జనంలోకి వచ్చే రెండు రోజులు మాత్రం హడావుడి.. తర్వాతేం ఉండదంటే… ప్రజలు కూడా లెక్కలోకి తీసుకోరు. నిరంతరం ప్రజల్లో ఉండి పోరాడితేనే ప్రయోజనం. ఈ విషయాలు తెలుసుకోవడానికి రాజకీయాల్లో పండిపోవాల్సిన పని లేదు. అందరికీ తెలుసు. కానీ జనసేన మాత్రం ఎందుకు అమలు చేయలేకపోతోందో మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close